Rajamouli : జపాన్ లో RRR సినిమా రీరిలీజ్.. రాజమౌళి ఎమోషనల్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి..అందుకు త్రిపుల్ ఆర్ సినిమా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.. సినిమా హిట్ అవ్వడంతో పాటుగా ఆస్కార్ కు కూడా ఎంపిక అయ్యింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటించారు.. 2022లో రిలీజయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి సక్సెస్ ను అందుకొని తెలుగు సినీ చరిత్రను తిరగరాసింది.. ఇప్పటికి కొన్ని దేశాల్లో సినిమా క్రేజ్ తగ్గలేదు..
ఈ సినిమాను అన్ని దేశాల్లో రిలీజ్ చేశారు.. జపాన్ లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ జనాలను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో కలిసి మరీ వెళ్లి RRR సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసారు.. అంతగా సినిమాకు జపాన్ ప్రజలు కనెక్ట్ అయ్యారు.. ఆ సినిమా పై మాత్రమే కాదు.. సినిమాలో నటించి హీరోల పై కూడా అభిమానాన్ని పెంచుకున్నారు..
Also Read
- Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా.. అమెరికాతో చెడిందా?
- Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
- CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
ఇదిలా ఉండగా తాజాగా జపాన్ లో RRR సినిమాని రీ రిలీజ్ చేశారు. దీంతో రాజమౌళి మరోసారి జపాన్ కి వెళ్లారు.. ప్రతి థియేటర్ హౌస్ ఫుల్ అయ్యింది.. రాజమౌళిని చూసిన ఫ్యాన్స్ సంతోషంలో మునుగిపోయారు. ఇక ఈ భామ్మ అయితే రాజమౌళికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది.. అప్పుడు బామ్మ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆర్గామి క్రేన్స్ అనే గిఫ్ట్ తమకి ఇష్టమైన వాళ్ళ కోసం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని తయారుచేస్తారు.. అలా ఈ బామ్మ జక్కన్నకు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.. ఇకపోతే జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు..
తాజావార్తలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా.. అమెరికాతో చెడిందా?
-
Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
-
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
-
CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!