RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీ లీక్.. ఫొటో ఇదిగో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఇదొక శుభవార్త. ఆర్సీబీ (RCB) కొత్త జెర్సీ లీక్ అయింది. ఈ జెర్సీని ఆర్సీబీ రివీల్ చేయాల్సి ఉండగా.. జెర్సీ లీక్ అయిపోయింది. ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, భారత దిగ్గజ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కొత్త జెర్సీలో కనిపిస్తున్నారు. కోహ్లీ తన జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు కోహ్లి, సిరాజ్లు కొత్త జెర్సీ ధరించిన ఫొటో వైరల్ అవుతోంది.
Virat Kohli In New Jersey Of RCB For IPL 2024.👕♥️ pic.twitter.com/Kj0rQWCTfv
Also Read
— Virat Kohli Fan Club (@Trend_VKohli) March 19, 2024
RCB జెర్సీ ఎలా ఉంటుంది?
ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ చెన్నై-బెంగళూరు మధ్య మార్చి 22న జరగనుంది. ఈ మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. WPL 2024 ట్రోఫీని కూడా ఆర్సీబీ గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇంతలో.. ఆర్సీబీ కొత్త జెర్సీ గురించి చర్చ ప్రారంభమైంది. విరాట్ కోహ్లి, సిరాజ్ ధరించిన జెర్సీలో సగం నీలిరంగు, సగం ఎరుపు రంగులో ఉండడం గమనించవచ్చు. ఇందులో బెంగుళూరు లోగో, ప్రకటనల కోసం అనేక కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. ఆర్సీబి జట్టు ఈ జెర్సీ ధరించి ఆడుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా రాలేదు.
RCB's new jersey of IPL 2024 is inspired by CSK's 2016/17 jersey 😭❤️ pic.twitter.com/eCxVGNDpvt
— Kevin (@imkevin149) March 19, 2024
తొలి మ్యాచ్ చిన్నస్వామిలో జరగనుంది
ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్ మార్చి 22న బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు బెంగళూరు నుంచి భారీ సంఖ్యలో ప్రేక్షకులు రానున్నారు. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కాగా, మరో వైపు తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవాలని కలలు కంటున్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగనుంది. బెంగళూరు వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా 2 నెలల తర్వాత తిరిగి వచ్చాడు. దీంతో తొలి మ్యాచ్పై అభిమానుల మదిలో ఉత్కంఠ మరింత పెరిగింది. తొలి మ్యాచ్లోనే తమ అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లిని చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది.
ఆర్సీబీపై అభిమానుల అంచనాలు పెరిగాయి
ఆర్సీబీ పురుషుల జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ను గెలుస్తుందని బెంగళూరులోని కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సీజన్లో మహిళల ప్రీమియర్ లీగ్లో బెంగళూరు ఫైనల్లో ఢిల్లీని ఓడించి బెంగళూరు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో మహిళల జట్టు.. ఆర్సీబీ అభిమానుల 16 ఏళ్ల కలను నిజం చేసింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సేన తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఉవిళ్లూరుతుంది.
తాజావార్తలు
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
-
Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!
-
Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?