IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఔట్!
- శ్రీలంకతో వన్డే సిరీస్
- ముగ్గురు స్టార్ ప్లేయర్స్ దూరం
- జులై 27 నుంచి ఆరంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma and Virat Kohli Might Skip Sri Lanka ODIs: భారత్ ప్రస్తుతం జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఆపై శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జులై 27 నుంచి ఆరంభం కానుండగా.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆగష్టు 2 నుంచి మొదలవనుంది. శ్రీలంకతో వన్డే సిరీస్కు ముగ్గురు స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
రోహిత్ శర్మ 2023 డిసెంబరు నుంచి ఆరు నెలలుగా మ్యాచ్లు ఆడుతూనే ఉన్నాడు. విరాట్ కోహ్లీ మధ్యలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరంగా ఉన్నా.. ఆపై ఐపీఎల్ 2024, టీ20 ప్రపంచకప్ 2024లో ఆడాడు. రోహిత్, కోహ్లీలు ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. లంకతో వన్డే సిరీస్ అనంతరం బంగ్లాదేశ్తో భారత్ రెండు టెస్టులు ఆడుతుంది. ఆ సిరీస్కు ఈ ఇద్దరు అందుబాటులోకి రానున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
- New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
Also Read: PV Sindhu: మరోసారి పతాకధారిగా పీవీ సింధు!
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ అనంతరం న్యూజిలాండ్తో మూడు టెస్టులు భారత్ ఆడనుంది. ఇక ఈ ఏడాది చివర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్తుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 ఫైనల్ లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లు రోహిత్ సేనకు కీలకం కానున్నాయి. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలలో ఒకరు శ్రీలంక వన్డే సిరీస్లో జట్టును నడిపించే అవకాశముంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!