Rohit Sharma: ఆ మ్యాచ్లో టాస్ గెలిచి ఏం ఎంచుకోవాలో మర్చిపోయా.. కుంబ్లేను కవర్ చేశా!
- టాస్ గెలిచి ఏం ఎంచుకోవాలో మర్చిపోయా
- మెంటర్ అనిల్ కుంబ్లేకు ఏదో చెప్పి కవర్ చేశా
- మ్యాచ్ అయ్యాక బతికిపోయా అని అనుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ.. ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అతడి భార్య గీతా బాస్రా హోస్ట్ చేసిన ‘హూ ఈజ్ ది బాస్ వైటీ’ అనే టాక్ షోలో రోహిత్ సతీసమేతంగా పాల్గొన్నాడు. భారత వన్డే కెప్టెన్ రోహిత్ ఈ షోలో పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్టీ20) మ్యాచ్ సందర్భంగా తాను టాస్ గెలిచి ఏం ఎంచుకోవాలో మర్చిపోయా అని, చీఫ్ మెంటర్ అనిల్ కుంబ్లేకు ఏదో చెప్పి కవర్ చేశా అని తెలిపాడు. హిట్మ్యాన్ తరచుగా ఫోన్, పాస్పోర్ట్ మర్చిపోతుంటాడన్న విషయం తెలిసిందే.
‘అది 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 మ్యాచ్. నేను ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా ఉన్నా, అనిల్ కుంబ్లే భాయ్ జట్టుకు చీఫ్ మెంటర్గా ఉన్నారు. టాస్ కోసం నేను మైదనంలోకి వెళ్లా. టాస్ గెలిచిన తర్వాత నేను బ్యాటింగ్ ఎంచుకున్నా. నిజానికి టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలని మేం ముందే అనుకున్నాం. నేను అది మర్చిపోయా. అనిల్ భాయ్ వచ్చి.. రోహిత్ నువ్ ఏం చేశావ్? అని అడిగాడు. పిచ్ బాగుంది కాబట్టి బ్యాటింగ్ ఎంచుకున్నాను అని కవర్ చేశా. నేను మర్చిపోయి బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ ఆ మ్యాచ్లో మేం గెలిచాం. మ్యాచ్ అయ్యాక బతికిపోయా అని అనుకున్నా’ అని రోహిత్ శర్మ చెప్పాడు. అప్పుడు హర్భజన్ సింగ్ సహా ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
Also Read: Jasprit Bumrah: అప్పటివరకు క్రికెట్ ఆడుతా.. బుమ్రా కీలక వ్యాఖ్యలు!
ఇంగ్లండ్ సిరీస్కు ముందు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల రోహిత్ దక్షిణాఫ్రికాపై 2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి కూడా రిటైర్ అయ్యాడు. హిట్మ్యాన్ ఇప్పుడు వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత రోహిత్ క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ 15 మ్యాచ్ల్లో 149.28 స్ట్రైక్ రేట్తో 418 పరుగులు చేశాడు. ఆగస్టు 17 నుండి 23 వరకు బంగ్లాదేశ్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రోహిత్ ఆడనున్నాడు. ఆపై అక్టోబర్ 19న ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..