Rohit Sharma: స్నేహితులతో చిల్ అవుతున్న రోహిత్.. పిక్స్ వైరల్!

  • సరదాగా గడుపుతున్న రోహిత్
  • స్నేహితులతో రెస్టారంట్‌కు హిట్‌మ్యాన్
  • నెట్టింట ఫొటో వైరల్
Rohit Sharma Friends

Rohit Sharma Friends

Rohit Sharma Enjoys With Friends: తనకొచ్చిన విరామాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ సరదాగా గడుపుతున్నాడు. కుటుంబం, స్నేహితులతో కలిసి ఫుల్ చిల్ అవుతున్నాడు. హిట్‌మ్యాన్ తన స్నేహితులైన భారత మాజీ క్రికెటర్ ధావల్ కులకర్ణి, టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌లతో కలిసి ఆదివారం ముంబైలోని ఓ రెస్టారంట్‌కు వెళ్లాడు. అక్కడ అందరూ భోజనం చేశారు. ఇందుకు సంబందించిన పోటోలను ధావల్ కులకర్ణి తన ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.

Also Read: Duleep Trophy 2024: అందుకే నన్ను దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు: రింకు సింగ్

×
×
Ad

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ 2024ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీ అనంతరం భారత జట్టు జింబాబ్వే, శ్రీలంకతో సిరీస్‌లు ఆడింది. లంక పర్యటనలో టీ20 సిరీస్‌ను గెలుచుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. శ్రీలంక స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడంలో రోహిత్ సేన విఫలమైంది. రోహిత్ 3 మ్యాచ్‌ల్లో 157 పరుగులు చేసి సిరీస్‌లో హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో భారత్ టెస్ట్ సిరీస్‌ను ఆడనుంది. ఆపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.