Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohini Karthi 2026: నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. తెలుగు పంచాంగం ప్రకారం మే 25 నుంచి ప్రారంభమైన ఈ కార్తె జూన్ 7 వరకు కొనసాగనుంది. ఈ కాలంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోహిణి కార్తె అంటేనే మండే ఎండలు, వడగాలులు, ఉక్కపోతకు ప్రతీకగా భావిస్తారు. “రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి” అనే సామెత కూడా ఈ కాలంలో ఉండే తీవ్ర వేడిని సూచిస్తుంది. ఈ సమయంలో శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గిపోవడంతో డీహైడ్రేషన్, వడదెబ్బ, తలనొప్పి, తీవ్ర అలసట వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మధ్యాహ్నం బయటకు రావద్దని సూచన
ప్రత్యేకంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప ఈ సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి తప్పనిసరిగా ఉపయోగించాలని, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. అలాగే తరచుగా నీరు తాగడం ద్వారా శరీరంలో నీటి కొరత రాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటి పానీయాలు తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా పుచ్చకాయ, దోసకాయ, ఖర్బూజ వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య దూరంగా ఉంటుంది.
కార్తెలకు అనుగుణంగా వాతావరణ మార్పులు
మన పూర్వీకులు శాస్త్రీయ పరికరాలు లేకపోయినా అనుభవంతో వాతావరణ మార్పులను అంచనా వేసేవారు. ఆ అనుభవాల ఆధారంగానే కార్తెలకు సంబంధించిన అనేక సామెతలు పుట్టుకొచ్చాయి. రోహిణి కార్తెలో తీవ్రమైన ఎండలు ఉంటాయని, జ్యేష్ఠ కార్తె వర్షాలకు సంకేతమని, మూల కార్తె భారీ వర్షాలను తీసుకొస్తుందని పెద్దలు చెప్పేవారు. నేటి కాలంలో భూతాపం కారణంగా వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినప్పటికీ, చాలా వరకు కార్తెల ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రోహిణి కార్తె విశిష్టత ఏమిటి?
తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించినప్పటి నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే వరకు ఉండే కాలాన్ని రోహిణి కార్తెగా పిలుస్తారు. సాధారణంగా ఇది దాదాపు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు భూమిపై నిటారుగా పడటంతో ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయి. అందుకే ఈ కాలంలో వడగాలులు, ఉక్కపోత తీవ్రంగా ఉంటాయి. వ్యవసాయ పరంగా కూడా రోహిణి కార్తెకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వర్షాకాలానికి ముందు నేలను సిద్ధం చేయడం, కొన్ని రకాల వరి నార్లు వేయడం వంటి వ్యవసాయ పనులకు ఈ కాలాన్ని అనుకూలంగా భావిస్తారు.
తాజావార్తలు
-
Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
-
Rajasthan Royals Injuries: ప్లేఆఫ్స్ చేరినా రాజస్థాన్కు టెన్షన్.. గాయాలతో సతమవుతున్న స్టార్ ప్లేయర్స్.!
-
Kuldeep Yadav: నేను చెత్త ప్రదర్శన చేశా.. చాలా బాధగా ఉంది.. కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్పై తీవ్ర విమర్శలు
-
Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!