Crime News : బైకు పాడైంది డబ్బులివ్వమంటే.. కత్తి తీసి కడుపులో పొడిచాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : నాగ్పూర్ లో షాకింగ్ సంఘటన జరిగింది. చూసుకోకుండా వచ్చి బైకును ఢీకొట్టడంతో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఓ వ్యక్తిని నిందితులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 10 గంటలకు నాగ్పూర్లోని కల్మన పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ ప్రాంతంలో జరిగింది. హత్యకు గురైన యువకుడి పేరు లక్ష్మీనారాయణ అలియాస్ అజయ్ తట్టు చందానియా. గత ఎనిమిది రోజుల్లో నాగ్పూర్లో జరిగిన మూడో హత్య ఇది.
లక్ష్మీనారాయణ, అతని స్నేహితుడు విజయనగరం ప్రాంతంలో బైకు పై వెళ్తున్నారు. ఆ సమయంలో అతడి బైక్ను మరో వ్యక్తి వినయ్ బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో బైకు దెబ్బతినడంతో లక్ష్మీనారాయణ, అతని స్నేహితుడు నిందితుల నుంచి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే వివాదం ముదిరి రెండో బైక్పై వచ్చిన నిందితులిద్దరూ లక్ష్మీనారాయణను కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ గొడవలో అతడి స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
Read Also: Himanshu : మాజీ ఎమ్మెల్యే మనువడు హిమాన్షుని కొట్టిచంపిన దుండగులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయ్ సాహు తన మేనల్లుడి పుట్టిన రోజు సందర్భంగా కేకు తీసుకురావడానికి బైకుపై బయలుదేరాడు. అదే సమయంలో గుల్మోహర్నగర్ సమీపంలో వినయ్, లక్ష్మీనారాయణ బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ బైక్ ధ్వంసమైంది. కాబట్టి పరిహారం ఇవ్వాలని వినయ్ ను కోరాడు లక్ష్మీనారాయణ. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ గొడవలో వినయ్ సాహు ముఖానికి గాయమై రక్తం కారింది. దీంతో ఆవేశానికి లోనైన వినయ్ తన వద్ద ఉన్న కత్తితో లక్ష్మణ్ ను పొడిచాడు. బైక్పై వెళ్తున్న స్నేహితుడిపై కూడా వినయ్ దాడి చేశాడు.
Read Also: Varun Gandhi: బీజేపీకి షాక్.. త్వరలో కాంగ్రెస్ లోకి వరుణ్ గాంధీ ?
ఈ ఘటనలో లక్ష్మీనారాయణకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కలమన పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మీనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అతడి స్నేహితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వెంటనే నిందితుడు వినయ్ సాహు చేతికి సంకెళ్లు వేశారు. ఈ ఘటనపై కల్మన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలోనే వినయ్ లక్ష్మీనారాయణపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వినయ్ పై గతంలో ఎలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేదని చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!