NTV Telugu Site icon

Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

Tirumala

Tirumala

Tirumala: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ 18వ మలుపు వద్ద వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అటుగా వెళ్తున్నారు. గాయపడిన వారి కోసం వెంటనే అంబులెన్స్‌ను రప్పించారు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించి తీవ్రంగా గాయపడిన మహిళను స్విమ్స్‌కు తరలించాల్సిందిగా జేఈవో వీరబ్రహ్మం ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Minister Ravi Kumar: ఏపీలో భారీ వర్షాలు.. విద్యుత్‌ శాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు