Axar Patel: ‘సొంత ఇంటికి స్వాగతం’.. పంత్ రాకపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ భావోద్వేగ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత కీలకమైన, అతిపెద్ద ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులోకి వచ్చారు. లక్నో సూపర్ జాయింట్స్ (LSG) కెప్టెన్గా ఉన్న పంత్ మళ్లీ తన పాత జట్టుకు మారడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ తాజా ట్రేడింగ్లో భాగంగా కేవలం రిషభ్ పంత్ మాత్రమే కాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జాయింట్స్ జట్టులోకి మారారు. ఒకే విండోలో ఇద్దరు స్టార్ భారతీయ ఆటగాళ్లు జట్లు మారడం ఐపీఎల్లో పెను సంచలనంగా మారింది.
లక్నో నుంచి ఢిల్లీకి మారిన క్రమంలో రిషభ్ పంత్ ఐపీఎల్ వేతనంలో భారీ కోత పడింది. సవరించిన నిబంధనల ప్రకారం రాబోయే సీజన్ కోసం పంత్ రూ. 15 కోట్ల ఫీజుతో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనున్నారు. మరోవైపు, లక్నో సూపర్ జాయింట్స్ జట్టులో చేరిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేతనంలో ఎలాంటి మార్పు లేదు. ఆయన తన ప్రస్తుత ఫీజు రూ. 13.50 కోట్లను లక్నో ఫ్రాంచైజీ నుండి యథాతథంగా అందుకోనున్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ జట్టులోకి రావడంపై ప్రస్తుత కెప్టెన్ అక్షర్ పటేల్ తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తూ ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. గతంలో పంత్ కెప్టెన్గా ఉన్న రోజులను అక్షర్ గుర్తుచేసుకుంటూ.. తమ మధ్య ఎలాంటి ఈగోలు లేవని, ఇద్దరం పరస్పర అవగాహనతో నిర్ణయాలు తీసుకునేవాళ్లమని పేర్కొన్నారు. ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి కానీ, కెప్టెన్గా తన నుంచి కానీ పంత్పై ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండదని, ఇది పంత్కు స్వంత ఇల్లు లాంటిదని అక్షర్ భరోసా ఇచ్చారు. “ఫామ్ అనేది తాత్కాలికం, కానీ క్లాస్ అనేది ఎప్పటికీ శాశ్వతం. నువ్వు ఆ కోవకు చెందిన ఆటగాడివి. కేవలం మైదానంలోకి వెళ్లి నీ ఆటను నువ్వు ఆస్వాదించు” అంటూ అక్షర్ పటేల్ పంత్ భుజం తట్టారు.
రిషభ్ పంత్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారానే ప్రారంభించి సుదీర్ఘంగా ఎనిమిది సీజన్లు ఆడారు. ఆ తర్వాత 2025 వేలంలో లక్నో సూపర్ జాయింట్స్ రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు వెచ్చించి పంత్ను కొనుగోలు చేసింది. అయితే, గత రెండు సీజన్లలో 28 ఇన్నింగ్స్లలో కేవలం ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో 269 పరుగులు (యావరేజ్ 24.45) మాత్రమే చేసి పంత్ ఆ ధరను నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు మళ్లీ పాత గూటికి చేరడంతో పంత్ పూర్వ వైభవాన్ని అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!