Axar Patel: ‘సొంత ఇంటికి స్వాగతం’.. పంత్ రాకపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ భావోద్వేగ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత కీలకమైన, అతిపెద్ద ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులోకి వచ్చారు. లక్నో సూపర్ జాయింట్స్ (LSG) కెప్టెన్గా ఉన్న పంత్ మళ్లీ తన పాత జట్టుకు మారడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ తాజా ట్రేడింగ్లో భాగంగా కేవలం రిషభ్ పంత్ మాత్రమే కాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జాయింట్స్ జట్టులోకి మారారు. ఒకే విండోలో ఇద్దరు స్టార్ భారతీయ ఆటగాళ్లు జట్లు మారడం ఐపీఎల్లో పెను సంచలనంగా మారింది.
లక్నో నుంచి ఢిల్లీకి మారిన క్రమంలో రిషభ్ పంత్ ఐపీఎల్ వేతనంలో భారీ కోత పడింది. సవరించిన నిబంధనల ప్రకారం రాబోయే సీజన్ కోసం పంత్ రూ. 15 కోట్ల ఫీజుతో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనున్నారు. మరోవైపు, లక్నో సూపర్ జాయింట్స్ జట్టులో చేరిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేతనంలో ఎలాంటి మార్పు లేదు. ఆయన తన ప్రస్తుత ఫీజు రూ. 13.50 కోట్లను లక్నో ఫ్రాంచైజీ నుండి యథాతథంగా అందుకోనున్నారు.
Also Read
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ జట్టులోకి రావడంపై ప్రస్తుత కెప్టెన్ అక్షర్ పటేల్ తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తూ ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. గతంలో పంత్ కెప్టెన్గా ఉన్న రోజులను అక్షర్ గుర్తుచేసుకుంటూ.. తమ మధ్య ఎలాంటి ఈగోలు లేవని, ఇద్దరం పరస్పర అవగాహనతో నిర్ణయాలు తీసుకునేవాళ్లమని పేర్కొన్నారు. ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి కానీ, కెప్టెన్గా తన నుంచి కానీ పంత్పై ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండదని, ఇది పంత్కు స్వంత ఇల్లు లాంటిదని అక్షర్ భరోసా ఇచ్చారు. “ఫామ్ అనేది తాత్కాలికం, కానీ క్లాస్ అనేది ఎప్పటికీ శాశ్వతం. నువ్వు ఆ కోవకు చెందిన ఆటగాడివి. కేవలం మైదానంలోకి వెళ్లి నీ ఆటను నువ్వు ఆస్వాదించు” అంటూ అక్షర్ పటేల్ పంత్ భుజం తట్టారు.
రిషభ్ పంత్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారానే ప్రారంభించి సుదీర్ఘంగా ఎనిమిది సీజన్లు ఆడారు. ఆ తర్వాత 2025 వేలంలో లక్నో సూపర్ జాయింట్స్ రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు వెచ్చించి పంత్ను కొనుగోలు చేసింది. అయితే, గత రెండు సీజన్లలో 28 ఇన్నింగ్స్లలో కేవలం ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో 269 పరుగులు (యావరేజ్ 24.45) మాత్రమే చేసి పంత్ ఆ ధరను నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు మళ్లీ పాత గూటికి చేరడంతో పంత్ పూర్వ వైభవాన్ని అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!