Axar Patel: ‘సొంత ఇంటికి స్వాగతం’.. పంత్ రాకపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ భావోద్వేగ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత కీలకమైన, అతిపెద్ద ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులోకి వచ్చారు. లక్నో సూపర్ జాయింట్స్ (LSG) కెప్టెన్గా ఉన్న పంత్ మళ్లీ తన పాత జట్టుకు మారడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ తాజా ట్రేడింగ్లో భాగంగా కేవలం రిషభ్ పంత్ మాత్రమే కాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జాయింట్స్ జట్టులోకి మారారు. ఒకే విండోలో ఇద్దరు స్టార్ భారతీయ ఆటగాళ్లు జట్లు మారడం ఐపీఎల్లో పెను సంచలనంగా మారింది.
లక్నో నుంచి ఢిల్లీకి మారిన క్రమంలో రిషభ్ పంత్ ఐపీఎల్ వేతనంలో భారీ కోత పడింది. సవరించిన నిబంధనల ప్రకారం రాబోయే సీజన్ కోసం పంత్ రూ. 15 కోట్ల ఫీజుతో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనున్నారు. మరోవైపు, లక్నో సూపర్ జాయింట్స్ జట్టులో చేరిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేతనంలో ఎలాంటి మార్పు లేదు. ఆయన తన ప్రస్తుత ఫీజు రూ. 13.50 కోట్లను లక్నో ఫ్రాంచైజీ నుండి యథాతథంగా అందుకోనున్నారు.
Also Read
- Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ జట్టులోకి రావడంపై ప్రస్తుత కెప్టెన్ అక్షర్ పటేల్ తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తూ ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. గతంలో పంత్ కెప్టెన్గా ఉన్న రోజులను అక్షర్ గుర్తుచేసుకుంటూ.. తమ మధ్య ఎలాంటి ఈగోలు లేవని, ఇద్దరం పరస్పర అవగాహనతో నిర్ణయాలు తీసుకునేవాళ్లమని పేర్కొన్నారు. ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి కానీ, కెప్టెన్గా తన నుంచి కానీ పంత్పై ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండదని, ఇది పంత్కు స్వంత ఇల్లు లాంటిదని అక్షర్ భరోసా ఇచ్చారు. “ఫామ్ అనేది తాత్కాలికం, కానీ క్లాస్ అనేది ఎప్పటికీ శాశ్వతం. నువ్వు ఆ కోవకు చెందిన ఆటగాడివి. కేవలం మైదానంలోకి వెళ్లి నీ ఆటను నువ్వు ఆస్వాదించు” అంటూ అక్షర్ పటేల్ పంత్ భుజం తట్టారు.
రిషభ్ పంత్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారానే ప్రారంభించి సుదీర్ఘంగా ఎనిమిది సీజన్లు ఆడారు. ఆ తర్వాత 2025 వేలంలో లక్నో సూపర్ జాయింట్స్ రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు వెచ్చించి పంత్ను కొనుగోలు చేసింది. అయితే, గత రెండు సీజన్లలో 28 ఇన్నింగ్స్లలో కేవలం ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో 269 పరుగులు (యావరేజ్ 24.45) మాత్రమే చేసి పంత్ ఆ ధరను నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు మళ్లీ పాత గూటికి చేరడంతో పంత్ పూర్వ వైభవాన్ని అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?