Site icon NTV Telugu

Rishabh Pant Captain: కెప్టెన్‌గా రిషభ్‌ పంత్.. వైస్‌ కెప్టెన్‌గా సాయి సుదర్శన్!

Rishabh Pant Captain

Rishabh Pant Captain

గాయం కారణంగా భారత జట్టు నుంచి తప్పుకున్న స్టార్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో త్వరలో జరిగే రెడ్‌ బాల్‌ సిరీస్‌లో భారత్‌-ఎ జట్టు తరఫున పంత్ బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్‌ కెప్టెన్‌గా సాయి సుదర్శన్ ఎంపికయ్యాడు. గత జూలైలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లోని మాంచెస్టర్ టెస్ట్ (నాలుగో టెస్టు)లో పంత్‌ పాదానికి గాయమైన విషయం తెలిసిందే.

అక్టోబర్ 30న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భారత్‌-ఎ, దక్షిణాఫ్రికా-ఎ మధ్య మొదటి నాలుగు రోజుల మ్యాచ్‌ జరగనుంది. అక్టోబర్ 25న హిమాచల్ ప్రదేశ్‌తో జరిగే ఢిల్లీ రంజీ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లో పంత్ తిరిగి బరిలోకి దిగుతాడని అందరూ భావించారు. కానీ రంజీ ట్రోఫీ చివరి రోజు తర్వాత రెండు రోజుల్లోనే భారత్‌-ఎ, దక్షిణాఫ్రికా-ఎ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అతడు రంజీ ట్రోఫీలో ఆడే అవకాశాలు లేవు.

మొదటి మ్యాచ్‌కు భారత జట్టు:
రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కొటియన్, మానవ్ సూతర్, అన్షుల్ కాంబోజ్, యశ్ జాష్ ఠాకూర్, సౌష్రాన్ బదూని, అయు.

రెండో మ్యాచ్‌కు భారత జట్టు:
రిషబ్ పంత్ (కెప్టెన్), కెఎల్ రాహుల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సూతర్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రస్, ఖలీల్ అహ్మద్, గురునూరు, అభిమన్యు, అభిమన్యు, క్రిష్ణ, అభిమన్యు.

 

Exit mobile version