Rishabh Pant: టెస్ట్ సిరీస్కు పంత్ దూరం.. 10 మందితోనే ఆడనున్న టీమిండియా!
- భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ
- టెస్ట్ సిరీస్కు రిషభ్ పంత్ దూరం
- పంత్కు ఆరు వారాలు విశ్రాంతి అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Ruled Out of England vs India Test Series: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. మాంచెస్టర్ టెస్టులో గాయపడ్డ పంత్కు ఆరు వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో నాలుగో టెస్ట్ సహా.. ఐదవ టెస్టుకు సైతం అతడు దూరమయ్యాడు. పంత్ స్థానంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆడనున్నాడు. పంత్ పాదం చివరి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో రిషభ్ పంత్ గాయపడ్డాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో అతడికి గాయం అయింది. బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి.. ఆపై పంత్ కుడి కాలి పాదానికి బలంగా తాకింది. వెంటనే అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. చికిత్స చేసినా లాభం లేకపోవడంతో.. పత్యేక వాహనంలో పంత్ మైదానం నుంచి బయటకు వెళ్లాడు. పంత్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాక రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. స్కాన్ రిపోర్ట్లలో పంత్ పాదం చివరి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఆరు వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు.
Also Read
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
రూల్స్ ప్రకారం.. కంకషన్ సబ్స్టిట్యూట్ అయితేనే గాయపడిన ఆటగాడి స్థానంలో మరో ప్లేయర్ వస్తాడు. ఇక్కడ రిషభ్ పంత్కు తలకు కాకుండా.. కాలికి గాయం అయింది కాబట్టి మరో ఆటగాడు భారత్ తరఫున బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. కేవలం కీపింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్ 10 మందితోనే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ. ఎందుకంటే ఈ సిరీస్లో అతడు అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. సిరీస్లో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం మాత్రమే ఉంది. మొదటి రోజు పంత్ 48 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?