Revanth Reddy : స్వతంత్రంతో ఒకవైపు ఆనందం. మరోవైపు దేశ విభజన విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచిందన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో లక్షలాది మంది జైళ్ల పాలు అయ్యారన్నారు. వేలాది మంది ప్రాణత్యాగాలు చేశారని, బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించి స్వతంత్రాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. అంతేకాకుండా.. ‘మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేత్కర్, నెహ్రు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమాల ఫలితం నేటి స్వాతంత్రం. పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్రం తో ఒకవైపు ఆనందం. మరోవైపు దేశ విభజన విషాదం. మత కల్లోలాలు, దేశ విభజన నేపథ్యంలో దేశంలో తొలి ప్రధానిగా నెహ్రు దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో తన దూర దృష్టి, విజ్ఞానం తో ఎంతో కృషి చేసారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో 140 కోట్ల ప్రజలు 75 ఏళ్ల నుంచి హక్కులు, బాధ్యతలతో దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం, అభివృద్ధి, నైపుణ్యంతో దేశాన్ని శక్తి వంచన లేకుండా నెహ్రు దేశాన్ని ముందుకు నడిపారు. దేశం కోసం మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు ప్రాణ త్యాగాలు చేశారు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
దేశాన్ని కడు పేదరికం నుంచి నేడు ప్రపంచంలో ఒక శక్తి వంతమైన దేశంగా నిర్మించడంలో కాంగ్రెస్ ప్రధాన మంత్రులు చేసిన కృషి మరువలేనిది. దేశంలో ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి ప్రజలను ఆత్మ గౌరవంతో బతికేల తీర్చిదిద్దిన ఘనత వారిది.. అలాగే 60 ఏళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీది. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పాలకులది.దేశ ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్న గుర్తించి సమన్వయంతో పని చేసి ప్రజల మనసులలో మంచి స్థానం సంపాదించాం..కానీ నేడు దేశంలో మత తత్వ శక్తులు దేశంలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుంది. ఎన్నో పోరాటాలు ఎంతో శ్రమకు ఓర్చి నిర్మించిన ఈ దేశంలో మళ్ళీ విభజించి లబ్ది పొందే చర్యలను మనం ప్రతిఘటించాలి.సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం లో పటిష్టమైన పోరాటంతో పనిచేయాలని కోరుకుంటున్నా’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?