Revanth Reddy : స్వతంత్రంతో ఒకవైపు ఆనందం. మరోవైపు దేశ విభజన విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచిందన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో లక్షలాది మంది జైళ్ల పాలు అయ్యారన్నారు. వేలాది మంది ప్రాణత్యాగాలు చేశారని, బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించి స్వతంత్రాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. అంతేకాకుండా.. ‘మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేత్కర్, నెహ్రు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమాల ఫలితం నేటి స్వాతంత్రం. పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్రం తో ఒకవైపు ఆనందం. మరోవైపు దేశ విభజన విషాదం. మత కల్లోలాలు, దేశ విభజన నేపథ్యంలో దేశంలో తొలి ప్రధానిగా నెహ్రు దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో తన దూర దృష్టి, విజ్ఞానం తో ఎంతో కృషి చేసారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో 140 కోట్ల ప్రజలు 75 ఏళ్ల నుంచి హక్కులు, బాధ్యతలతో దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం, అభివృద్ధి, నైపుణ్యంతో దేశాన్ని శక్తి వంచన లేకుండా నెహ్రు దేశాన్ని ముందుకు నడిపారు. దేశం కోసం మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు ప్రాణ త్యాగాలు చేశారు.
Also Read
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
దేశాన్ని కడు పేదరికం నుంచి నేడు ప్రపంచంలో ఒక శక్తి వంతమైన దేశంగా నిర్మించడంలో కాంగ్రెస్ ప్రధాన మంత్రులు చేసిన కృషి మరువలేనిది. దేశంలో ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి ప్రజలను ఆత్మ గౌరవంతో బతికేల తీర్చిదిద్దిన ఘనత వారిది.. అలాగే 60 ఏళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీది. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పాలకులది.దేశ ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్న గుర్తించి సమన్వయంతో పని చేసి ప్రజల మనసులలో మంచి స్థానం సంపాదించాం..కానీ నేడు దేశంలో మత తత్వ శక్తులు దేశంలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుంది. ఎన్నో పోరాటాలు ఎంతో శ్రమకు ఓర్చి నిర్మించిన ఈ దేశంలో మళ్ళీ విభజించి లబ్ది పొందే చర్యలను మనం ప్రతిఘటించాలి.సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం లో పటిష్టమైన పోరాటంతో పనిచేయాలని కోరుకుంటున్నా’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..