CM Revanth Reddy: బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.. ప్రాజెక్ట్ను ఆపే ప్రసక్తే లేదు..
- ఈ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్ రహిత నల్గొండను చూడాలి అనుకున్నాం..
- గత ప్రభుత్వం బిల్లులు సక్రమంగా చెల్లించలేదు
- మేము ప్రాజెక్ట్ ను పునః ప్రారంభించాం
- నిపుణులు అందరితో చర్చించే స్టార్ట్ చేశాం
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన స్థలాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా రెస్య్కూ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి సమీక్షించారు. గంటకు పైగా వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలా ఐనా సరే.. ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “SLBC త్వరగా పూర్తి ఐతే ఫ్లోరైడ్ రహిత నల్గొండ ను చూడాలి అనుకున్నాం.. కానీ గత ప్రభుత్వం బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పదేళ్లుగా పనులు నిలిచిపోయాయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఈ ప్రాజెక్ట్ ను పునః ప్రారంభించాం.. నిపుణులు అందరితో చర్చించే.. పనులు స్టార్ట్ చేశాం.. అనుకోకుండా దుర్ఘటన జరిగింది.. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా సానుభూతి తెలపాలి.. 11 కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఈ విపత్తు లో పనిచేస్తున్నాయి.. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా తమవంతు సహకారం అందిస్తున్నాయి… రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 11 సంస్థలను అభినందిస్తున్నా..” అని సీఎం అన్నారు.
READ MORE: Sonudi Film Factory: ఆశిష్ గాంధీ కొత్త సినిమా మొదలైంది!
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
“కన్వేయర్ బెల్ట్ ను రేపటిలోగా అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు.. కన్వేయర్ బెల్ట్ సిద్ధం ఐతే.. లోపల ఉన్న మట్టి, బురద తరలించడం ఈజీ అవుతుంది.. ఇది ఒక ప్రమాదం.. ఇది విపత్తు.. అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. హెలికాప్టర్ ఇచ్చి మంత్రులు జూపల్లి, ఉత్తమ్ లను ఇక్కడికి పంపాను.. ఎప్పటికప్పుడు రెస్క్యూ సమాచారం తెలుసుకున్నాను.. నిమిషం నిమిషం మానిటరింగ్ చేశాను.. 8 కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం.. గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ లో ప్రమాదం జరిగితే.. నేను వచ్చే ప్రయత్నం చేసాను. నన్ను అడ్డుకుని అరెస్ట్ చేసింది గత ప్రభుత్వం. అవసరమైతే రోబో లను పంపి.. రెస్క్యూ ఆపరేషన్ లో వాడుకునే దిశగా ప్రయత్నం చేయాలని సూచించా. ఎలా ఐనా సరే.. ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలి అనే పట్టుదలతో ఉన్నాం.” సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!