రేవంత్ కు.. ‘ఆ టీమ్’ సహాయ నిరాకరణ చేస్తోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ కు మూలస్తంభాలుగా ఉన్న నేతల్లో.. జానారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుత టీ కాంగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్నా.. వీళ్లందరినీ కలుపుకొని వెళ్తే తప్ప.. పార్టీని ముందుకు తీసుకువెళ్లలేరు. వీళ్లు మాత్రమే కాదు.. రెండో వరసలో.. షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ వంటి నేతలను కూడా రేవంత్ సమన్వయం చేసుకోవాల్సిందే. లేదంటే.. అధికారం అన్న ఆకాంక్షను ఆయన చేరుకోవడం చాలా కష్టం అవుతుంది.
ఇదంతా అందరికీ తెలిసిన విషయమే కానీ.. ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే.. ఓ కీలకమైన విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందునుంటే జానారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడిని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. పొన్నాల లక్ష్మయ్య సైతం ఎక్కువగా మీడియా ముందుకు కూడా రావడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా రాజీనామా చేసిన నాటినుంచే సైడ్ అయిపోయారు.
Also Read
కోమటిరెడ్డి బ్రదర్స్ – రేవంత్ రెడ్డి రిలేషన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. న్యూట్రల్ గా ముందుకు పోతున్నారు. కలిసినప్పుడు కావలించుకోవడం తప్ప.. ఇప్పటివరకూ రేవంత్ కు అండగా మేమున్నామంటూ.. ధైర్యంగా షబ్బీర్, పొన్నం వంటి నేతలు చెప్పిన సందర్భాలు లేవు. కేవలం.. సీతక్క, మధు యాష్కీ, సంపత్, అద్దంకి దయాకర్ వంటి నేతలు తప్ప రేవంత్ పోరాటానికి మద్దతుగా ముందు నిలుస్తున్న నేతలైతే కనిపించడం లేదు.
ఇదంతా చూస్తుంటే.. సీనియర్స్ టీమ్ అంతా సహాయ నిరాకణ చేస్తోందా.. అన్న అనుమానాన్ని కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ చతుర్ముఖ పోటీలో.. కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తే కనీసం 30 నుంచి 40 సీట్లైనా గెలుచుకోవచ్చని పార్టీ కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. కాంగ్రెస్సే కింగ్ మేకర్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి తరుణంలో.. సీనియర్లు ఇలా నాయకత్వానికి దూరంగా ఉంటుండడం.. అంత మంచిది కాదేమో అని ఆందోళన చెందుతున్నారు. రేవంత్ కూడా.. అందరినీ మరోసారి కలుపుకొనిపోయే ప్రయత్నం చేయాలని.. ఈ విషయాన్ని పార్టీ హై కమాండ్ సైతం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని.. పార్టీ శ్రేణులు ఓపెన్ గానే ఒపీనియన్ చెబుతున్నారు. మరి.. వారు ఆశించిన మార్పు కనిపిస్తుందా? చూద్దాం.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!