Congress: రాహుల్ గాంధీ ఈడీ విచారణ.. రాజ్ భవన్ ముట్టడికి పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని మూడు రోజులుగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. ఢిల్లీలో ఈడీ ఆఫీస్ ముందే కాంగ్రెస్ అగ్రనేతలు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తాజాగా రాహుల్ గాంధీ ఈడీ విచారణపై తెలంగాణ కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. గురువారం రాజ్ భవన్ ముందు నిరసన తెలపనున్నారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. రేపు ఉదయం 10 గంటలకు పీజేఆర్ విగ్రహం వద్దకు చేరుకోవాలని కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా రాజ్ భవన్ వరకు వెళ్లనున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకావాలని రేవంత్ రెడ్డి కోరారు. జిల్లాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాాలయాల ముందు నిరసన తెలపాలని శ్రేణులకు సూచించారు.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
ఈడీ విచారణపై రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ అనుబంధ సంస్థగా ఈడీ మారిందని.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. అర్థరాత్రి వరు విచారణ పేరుతో వేధిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తే, పోలీసులు దారుణంగా దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. ఈ రోజు ఏఐసీసీ కార్యాలయంలోకి కూడా పోలీసులు వెళ్లారని.. గాంధీ కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపులకు బలి చేయాలని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు.
తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వకపోతే..వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా తెలంగాన వచ్చేది కాదని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీకి జరిగిన అవమానం అంటే..దేశ ప్రజల మీద సంస్కృతి మీద దాడి చేసినట్టే అని అన్నారు. అర్థంపర్థం లేని ఈడీ నోటిసులు ఇచ్చి..మీరు కడుక్కొండి అంటే ఎలా అని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ గాంధీలను ఎదుర్కోలేకే ఈడీ పేరుతో వేధిస్తున్నారని.. రేపు కాంగ్రెస్ తడాఖా ఏమిటో చూపిస్తాం అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు.
తాజావార్తలు
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉంది”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!