IPL History: ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్ను మెయిడెన్ చేసిన అతి భీకర బౌలర్స్ ఎవరో తెలుసా..?
- IPL చరిత్రలో 20వ ఓవర్ను మెయిడెన్గా వేసిన బౌలర్లు
- ఇప్పటివరకు ఐదు మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL History: బ్యాటర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఐపీఎల్ లో ఒక్క ఓవర్ మెయిడెన్ చేయడమంటే అంత సులువు కాదు. ఇలాంటి మెయిడెన్స్ జరగడం చాలా తక్కువ శాతం ఉంటుంది. అలాంటిది ఇన్నింగ్స్ చివరి ఓవర్ అంటే 20వ ఓవర్ను మెయిడెన్ చేయడమంటే అంత సులువు కాదు. చివరి ఓవర్ లో ఎలాగైనా పరుగులు రాబట్టలని చూసే బ్యాటర్స్ ను అడ్డుకొని మెయిడెన్ చేసిన బౌలర్లు ఉన్నారని మీకు తెలుసా..?
నిజానికి ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్ను మెయిడెన్గా ముగించటం ఒక అరుదైన ఘటన. బాగా ఒత్తిడిలో ఉండే ఈ చివరి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ వేసిన బౌలర్లు ఉన్నారు. ఇలా ఇప్పటివరకు ఐపీఎల్ లో ఈ ఘనతను సొంతం చేసుకున్న వారు ఐదుగురు మాత్రమే. మరి ఆ బౌల్వెర్స్ ఎవరో ఒకసారి చూసేద్దామా..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Read Also: IPL 2025 Final: వర్షం కారణంగా ఫైనల్ రద్దయితే.. నెక్స్ట్ ఏంటి..? రిజర్వ్ డే ఉందా..?
ఈ ఘనతను పొందిన తొలి బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. 2008లో కింగ్స్ XI పంజాబ్ తరఫున ముంబై ఇండియన్స్పై జరిగిన మ్యాచ్లో 20వ ఓవర్ను మెయిడెన్గా ముగించి తన జట్టుకు 66 పరుగుల తేడాతో విజయం సాధించడంలో సహాయపడ్డాడు. అనంతరం, 2009లో ముంబై ఇండియన్స్ తరఫున లసిత్ మలింగా డెక్కన్ ఛార్జర్స్పై 20వ ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేసాడు.
Read Also: Minister Vasamsetti Subhash: లోకేష్తో జగన్ పది నిమిషాలు డిబేట్లో కూర్చోగలరా..?
ఆ తర్వాత జయదేవ్ ఉనద్కత్ 2017లో రైజింగ్ పుణే సూపర్జెయింట్ తరఫున సన్రైజర్స్ హైదరాబాద్పై 20వ ఓవర్లో హ్యాట్రిక్ సాధించి, ట్రిపుల్ వికెట్ మెయిడెన్ బౌలింగ్ చేశాడు. ఇది మ్యాచ్ను తక్కువ స్కోరుతోనే గెలవడానికి కీలకంగా మారింది. ఆ తర్వాత 2022లో భారత దేశ యువ స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున పంజాబ్ కింగ్స్పై 20వ ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేసి, తన దూకుడు చూపించాడు.
అలాగే 2023లో మహీష్ తీక్షన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ పై 20వ ఓవర్ను మెయిడెన్గా ముగించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అతను ఈ ఘనతను సాధించిన తొలి స్పిన్నర్ కావడం. ఈ ఐదుగురు బౌలర్లు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఒత్తిడిలోనూ మెయిడెన్ బౌలింగ్ చేస్తూ తమ జట్లకు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!