IPL History: ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్ను మెయిడెన్ చేసిన అతి భీకర బౌలర్స్ ఎవరో తెలుసా..?
- IPL చరిత్రలో 20వ ఓవర్ను మెయిడెన్గా వేసిన బౌలర్లు
- ఇప్పటివరకు ఐదు మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL History: బ్యాటర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఐపీఎల్ లో ఒక్క ఓవర్ మెయిడెన్ చేయడమంటే అంత సులువు కాదు. ఇలాంటి మెయిడెన్స్ జరగడం చాలా తక్కువ శాతం ఉంటుంది. అలాంటిది ఇన్నింగ్స్ చివరి ఓవర్ అంటే 20వ ఓవర్ను మెయిడెన్ చేయడమంటే అంత సులువు కాదు. చివరి ఓవర్ లో ఎలాగైనా పరుగులు రాబట్టలని చూసే బ్యాటర్స్ ను అడ్డుకొని మెయిడెన్ చేసిన బౌలర్లు ఉన్నారని మీకు తెలుసా..?
నిజానికి ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్ను మెయిడెన్గా ముగించటం ఒక అరుదైన ఘటన. బాగా ఒత్తిడిలో ఉండే ఈ చివరి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ వేసిన బౌలర్లు ఉన్నారు. ఇలా ఇప్పటివరకు ఐపీఎల్ లో ఈ ఘనతను సొంతం చేసుకున్న వారు ఐదుగురు మాత్రమే. మరి ఆ బౌల్వెర్స్ ఎవరో ఒకసారి చూసేద్దామా..
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
Read Also: IPL 2025 Final: వర్షం కారణంగా ఫైనల్ రద్దయితే.. నెక్స్ట్ ఏంటి..? రిజర్వ్ డే ఉందా..?
ఈ ఘనతను పొందిన తొలి బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. 2008లో కింగ్స్ XI పంజాబ్ తరఫున ముంబై ఇండియన్స్పై జరిగిన మ్యాచ్లో 20వ ఓవర్ను మెయిడెన్గా ముగించి తన జట్టుకు 66 పరుగుల తేడాతో విజయం సాధించడంలో సహాయపడ్డాడు. అనంతరం, 2009లో ముంబై ఇండియన్స్ తరఫున లసిత్ మలింగా డెక్కన్ ఛార్జర్స్పై 20వ ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేసాడు.
Read Also: Minister Vasamsetti Subhash: లోకేష్తో జగన్ పది నిమిషాలు డిబేట్లో కూర్చోగలరా..?
ఆ తర్వాత జయదేవ్ ఉనద్కత్ 2017లో రైజింగ్ పుణే సూపర్జెయింట్ తరఫున సన్రైజర్స్ హైదరాబాద్పై 20వ ఓవర్లో హ్యాట్రిక్ సాధించి, ట్రిపుల్ వికెట్ మెయిడెన్ బౌలింగ్ చేశాడు. ఇది మ్యాచ్ను తక్కువ స్కోరుతోనే గెలవడానికి కీలకంగా మారింది. ఆ తర్వాత 2022లో భారత దేశ యువ స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున పంజాబ్ కింగ్స్పై 20వ ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేసి, తన దూకుడు చూపించాడు.
అలాగే 2023లో మహీష్ తీక్షన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ పై 20వ ఓవర్ను మెయిడెన్గా ముగించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అతను ఈ ఘనతను సాధించిన తొలి స్పిన్నర్ కావడం. ఈ ఐదుగురు బౌలర్లు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఒత్తిడిలోనూ మెయిడెన్ బౌలింగ్ చేస్తూ తమ జట్లకు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!