IPL History: ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్ను మెయిడెన్ చేసిన అతి భీకర బౌలర్స్ ఎవరో తెలుసా..?
- IPL చరిత్రలో 20వ ఓవర్ను మెయిడెన్గా వేసిన బౌలర్లు
- ఇప్పటివరకు ఐదు మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL History: బ్యాటర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఐపీఎల్ లో ఒక్క ఓవర్ మెయిడెన్ చేయడమంటే అంత సులువు కాదు. ఇలాంటి మెయిడెన్స్ జరగడం చాలా తక్కువ శాతం ఉంటుంది. అలాంటిది ఇన్నింగ్స్ చివరి ఓవర్ అంటే 20వ ఓవర్ను మెయిడెన్ చేయడమంటే అంత సులువు కాదు. చివరి ఓవర్ లో ఎలాగైనా పరుగులు రాబట్టలని చూసే బ్యాటర్స్ ను అడ్డుకొని మెయిడెన్ చేసిన బౌలర్లు ఉన్నారని మీకు తెలుసా..?
నిజానికి ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్ను మెయిడెన్గా ముగించటం ఒక అరుదైన ఘటన. బాగా ఒత్తిడిలో ఉండే ఈ చివరి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ వేసిన బౌలర్లు ఉన్నారు. ఇలా ఇప్పటివరకు ఐపీఎల్ లో ఈ ఘనతను సొంతం చేసుకున్న వారు ఐదుగురు మాత్రమే. మరి ఆ బౌల్వెర్స్ ఎవరో ఒకసారి చూసేద్దామా..
Also Read
- Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
Read Also: IPL 2025 Final: వర్షం కారణంగా ఫైనల్ రద్దయితే.. నెక్స్ట్ ఏంటి..? రిజర్వ్ డే ఉందా..?
ఈ ఘనతను పొందిన తొలి బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. 2008లో కింగ్స్ XI పంజాబ్ తరఫున ముంబై ఇండియన్స్పై జరిగిన మ్యాచ్లో 20వ ఓవర్ను మెయిడెన్గా ముగించి తన జట్టుకు 66 పరుగుల తేడాతో విజయం సాధించడంలో సహాయపడ్డాడు. అనంతరం, 2009లో ముంబై ఇండియన్స్ తరఫున లసిత్ మలింగా డెక్కన్ ఛార్జర్స్పై 20వ ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేసాడు.
Read Also: Minister Vasamsetti Subhash: లోకేష్తో జగన్ పది నిమిషాలు డిబేట్లో కూర్చోగలరా..?
ఆ తర్వాత జయదేవ్ ఉనద్కత్ 2017లో రైజింగ్ పుణే సూపర్జెయింట్ తరఫున సన్రైజర్స్ హైదరాబాద్పై 20వ ఓవర్లో హ్యాట్రిక్ సాధించి, ట్రిపుల్ వికెట్ మెయిడెన్ బౌలింగ్ చేశాడు. ఇది మ్యాచ్ను తక్కువ స్కోరుతోనే గెలవడానికి కీలకంగా మారింది. ఆ తర్వాత 2022లో భారత దేశ యువ స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున పంజాబ్ కింగ్స్పై 20వ ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేసి, తన దూకుడు చూపించాడు.
అలాగే 2023లో మహీష్ తీక్షన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ పై 20వ ఓవర్ను మెయిడెన్గా ముగించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అతను ఈ ఘనతను సాధించిన తొలి స్పిన్నర్ కావడం. ఈ ఐదుగురు బౌలర్లు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఒత్తిడిలోనూ మెయిడెన్ బౌలింగ్ చేస్తూ తమ జట్లకు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
తాజావార్తలు
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!