Retail Inflation Data: 15 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం.. జూలైలో 7.44శాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Retail Inflation Data: టమాటాలతో సహా ఆహార పదార్థాల ధరల్లో తీవ్ర పెరుగుదల కారణంగా జూలై 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ లాంగ్ జంప్ చేసింది.. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం దాటింది. సీపీఐ ద్రవ్యోల్బణం జూలైలో 7.44 శాతంగా ఉంది. ఇది జూన్ 2023లో 4.81 శాతంగా ఉంది. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం ఎగువ స్లాబ్ను దాటింది. పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.63 శాతంగా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 7.20 శాతంగా ఉంది.
ఖరీదైన ఆహార పదార్థాలు
రిటైల్ ద్రవ్యోల్బణం రేటుకు సంబంధించి గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. జూలైలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేటులో భారీ పెరుగుదల ఉంది. జులైలో ఆహార ద్రవ్యోల్బణం 11.51 శాతంగా ఉండగా, జూన్లో 4.49 శాతంగా ఉంది. అంటే ఒక్క నెలలోనే ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అక్టోబర్ 2020 తర్వాత ఆహార ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఇదే అత్యధిక స్థాయి.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
Read Also:Mamata Banerjee: కేంద్రంలో రాజకీయ స్థానం అవసరం లేదు… అదొక్కటే లక్ష్యమంటున్న మమతా బెనర్జీ
గణనీయంగా పెరిగిన కూరగాయల ద్రవ్యోల్బణం
జూలై నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 37.34 శాతంగా ఉంది. ఇది జూన్ 2023లో -0.93 శాతంగా ఉంది. అంటే, ఒక నెలలో ఆకుకూరలు, కూరగాయల ద్రవ్యోల్బణం రేటు 38 శాతానికి పైగా పెరిగింది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం జూన్లో 10.53 శాతంగా ఉన్న 13.27 శాతంగా ఉంది. సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం జూన్లో 19.19 శాతంగా ఉన్న 21.53 శాతంగా ఉంది. పాలు, దాని సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్లో 8.56 శాతంగా ఉన్న 8.34 శాతంగా ఉంది. ఆహార ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్లో 12.71 శాతంగా ఉన్న 13.04 శాతంగా ఉంది. చమురు, కొవ్వుల ద్రవ్యోల్బణం జూన్లో -18.12 శాతం, -16.80 శాతంగా ఉంది.
గత ఏడాది మే 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం దాటింది. ఆ తర్వాత ఆర్బీఐ రెపో రేటును పెంచడం ప్రారంభించింది. రెపో రేటును 4 శాతం నుంచి 6.50 శాతానికి పెంచారు. మే 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.25 శాతానికి తగ్గినప్పుడు ఖరీదైన ఈఎంఐ నుండి ఉపశమనం లభిస్తుందనే ఆశ ఉంది. అయితే మళ్లీ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7 శాతం దాటింది. దీంతో ఖరీదైన ఈఎంఐ నుంచి ఉపశమనం లభిస్తుందన్న ఆశ ప్రస్తుతానికి ముగిసినట్లే. ఎందుకంటే ద్రవ్యోల్బణం రేటు ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ కంటే ఎక్కువగా ఉంది.
Read Also:Kishan Reddy: కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కి వేసినట్టే.. మజ్లిస్ చేతికి స్టీరింగ్..!
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..