Egypt President: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా భారత్కు విచ్చేసిన ఈజిప్ట్ ప్రెసిడెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Republic Day Parade Chief Guest Egypt President Al-Sisi: ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి మంగళవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జనవరి 24-27 వరకు ఆయన అధికారిక పర్యటన కోసం ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులతో సహా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆయనతో కలిసి ఇండియాకు విచ్చేశారు. ఆయన ఢిల్లీకి చేరుకున్నప్పుడు సాంప్రదాయ జానపద నృత్యంతో స్వాగతం పలికారు. గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి.
పర్యటనలో భాగంగా అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్లతో సమావేశం కానున్నారు. ఈ నెల 26న భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కాగా, భారత గణతంత్ర వేడుకలకు విదేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో ఎవరూ రాలేదు. జీ20 అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో భారత్ ఈజిప్టును ‘అతిథి దేశం’గా ఆహ్వానించడం గమనార్హం.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
Bodies Found: నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం
విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బుధవారం రాష్ట్రపతి భవన్లో సిసికి లాంఛనప్రాయ స్వాగతం లభించనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తదితరులతో ఆయన రాష్ట్రపతి భవన్లో సమావేశం కానున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ స్మారక చిహ్నం రాజ్ఘాట్లో ఆయన పుష్పగుచ్ఛంతో నివాళులర్పించనున్నారు. ప్రధాని మోడీతో సమావేశం నిర్వహించి, ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. అదే రోజు సాయంత్రం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథి గౌరవార్థం రాష్ట్ర విందును నిర్వహిస్తారు.
రిపబ్లిక్ డే రోజున ఆయన రిపబ్లిక్ డే పరేడ్కు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈజిప్టు సైనిక బృందం ఇతర బృందాలతో కలిసి రాజ్పథ్పై కవాతు చేస్తుంది. రాష్ట్రపతి భవన్లో అధ్యక్షుడు ముర్ము నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఈజిప్టు అధ్యక్షుడు హాజరవుతారు. ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్తో కూడా సమావేశం కానున్నారు. భారతదేశంలోని వ్యాపార వర్గాలతో ఆయన సంభాషించనున్నారు. ఆ తర్వాత జనవరి 27న తిరిగి కైరో చేరుకుంటారు. రెండు దేశాల మధ్య సంబంధాలు భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడానికి నిబద్ధత, రక్షణ, భద్రత, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కలయికతో సహా వివిధ రంగాలలో సహకారంపై ఆధారపడి ఉంటాయి.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..