Egypt President: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా భారత్కు విచ్చేసిన ఈజిప్ట్ ప్రెసిడెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Republic Day Parade Chief Guest Egypt President Al-Sisi: ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి మంగళవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జనవరి 24-27 వరకు ఆయన అధికారిక పర్యటన కోసం ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులతో సహా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆయనతో కలిసి ఇండియాకు విచ్చేశారు. ఆయన ఢిల్లీకి చేరుకున్నప్పుడు సాంప్రదాయ జానపద నృత్యంతో స్వాగతం పలికారు. గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి.
పర్యటనలో భాగంగా అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్లతో సమావేశం కానున్నారు. ఈ నెల 26న భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కాగా, భారత గణతంత్ర వేడుకలకు విదేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో ఎవరూ రాలేదు. జీ20 అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో భారత్ ఈజిప్టును ‘అతిథి దేశం’గా ఆహ్వానించడం గమనార్హం.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
Bodies Found: నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం
విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బుధవారం రాష్ట్రపతి భవన్లో సిసికి లాంఛనప్రాయ స్వాగతం లభించనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తదితరులతో ఆయన రాష్ట్రపతి భవన్లో సమావేశం కానున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ స్మారక చిహ్నం రాజ్ఘాట్లో ఆయన పుష్పగుచ్ఛంతో నివాళులర్పించనున్నారు. ప్రధాని మోడీతో సమావేశం నిర్వహించి, ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. అదే రోజు సాయంత్రం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథి గౌరవార్థం రాష్ట్ర విందును నిర్వహిస్తారు.
రిపబ్లిక్ డే రోజున ఆయన రిపబ్లిక్ డే పరేడ్కు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈజిప్టు సైనిక బృందం ఇతర బృందాలతో కలిసి రాజ్పథ్పై కవాతు చేస్తుంది. రాష్ట్రపతి భవన్లో అధ్యక్షుడు ముర్ము నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఈజిప్టు అధ్యక్షుడు హాజరవుతారు. ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్తో కూడా సమావేశం కానున్నారు. భారతదేశంలోని వ్యాపార వర్గాలతో ఆయన సంభాషించనున్నారు. ఆ తర్వాత జనవరి 27న తిరిగి కైరో చేరుకుంటారు. రెండు దేశాల మధ్య సంబంధాలు భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడానికి నిబద్ధత, రక్షణ, భద్రత, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కలయికతో సహా వివిధ రంగాలలో సహకారంపై ఆధారపడి ఉంటాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?