Egypt President: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా భారత్కు విచ్చేసిన ఈజిప్ట్ ప్రెసిడెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Republic Day Parade Chief Guest Egypt President Al-Sisi: ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి మంగళవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జనవరి 24-27 వరకు ఆయన అధికారిక పర్యటన కోసం ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులతో సహా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆయనతో కలిసి ఇండియాకు విచ్చేశారు. ఆయన ఢిల్లీకి చేరుకున్నప్పుడు సాంప్రదాయ జానపద నృత్యంతో స్వాగతం పలికారు. గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి.
పర్యటనలో భాగంగా అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్లతో సమావేశం కానున్నారు. ఈ నెల 26న భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కాగా, భారత గణతంత్ర వేడుకలకు విదేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో ఎవరూ రాలేదు. జీ20 అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో భారత్ ఈజిప్టును ‘అతిథి దేశం’గా ఆహ్వానించడం గమనార్హం.
Also Read
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
Bodies Found: నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం
విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బుధవారం రాష్ట్రపతి భవన్లో సిసికి లాంఛనప్రాయ స్వాగతం లభించనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తదితరులతో ఆయన రాష్ట్రపతి భవన్లో సమావేశం కానున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ స్మారక చిహ్నం రాజ్ఘాట్లో ఆయన పుష్పగుచ్ఛంతో నివాళులర్పించనున్నారు. ప్రధాని మోడీతో సమావేశం నిర్వహించి, ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. అదే రోజు సాయంత్రం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథి గౌరవార్థం రాష్ట్ర విందును నిర్వహిస్తారు.
రిపబ్లిక్ డే రోజున ఆయన రిపబ్లిక్ డే పరేడ్కు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈజిప్టు సైనిక బృందం ఇతర బృందాలతో కలిసి రాజ్పథ్పై కవాతు చేస్తుంది. రాష్ట్రపతి భవన్లో అధ్యక్షుడు ముర్ము నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఈజిప్టు అధ్యక్షుడు హాజరవుతారు. ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్తో కూడా సమావేశం కానున్నారు. భారతదేశంలోని వ్యాపార వర్గాలతో ఆయన సంభాషించనున్నారు. ఆ తర్వాత జనవరి 27న తిరిగి కైరో చేరుకుంటారు. రెండు దేశాల మధ్య సంబంధాలు భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడానికి నిబద్ధత, రక్షణ, భద్రత, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కలయికతో సహా వివిధ రంగాలలో సహకారంపై ఆధారపడి ఉంటాయి.
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!