Egypt President: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా భారత్కు విచ్చేసిన ఈజిప్ట్ ప్రెసిడెంట్
Republic Day Parade Chief Guest Egypt President Al-Sisi: ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి మంగళవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జనవరి 24-27 వరకు ఆయన అధికారిక పర్యటన కోసం ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులతో సహా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆయనతో కలిసి ఇండియాకు విచ్చేశారు. ఆయన ఢిల్లీకి చేరుకున్నప్పుడు సాంప్రదాయ జానపద నృత్యంతో స్వాగతం పలికారు. గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి.
పర్యటనలో భాగంగా అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్లతో సమావేశం కానున్నారు. ఈ నెల 26న భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కాగా, భారత గణతంత్ర వేడుకలకు విదేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో ఎవరూ రాలేదు. జీ20 అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో భారత్ ఈజిప్టును ‘అతిథి దేశం’గా ఆహ్వానించడం గమనార్హం.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Bodies Found: నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం
విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బుధవారం రాష్ట్రపతి భవన్లో సిసికి లాంఛనప్రాయ స్వాగతం లభించనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తదితరులతో ఆయన రాష్ట్రపతి భవన్లో సమావేశం కానున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ స్మారక చిహ్నం రాజ్ఘాట్లో ఆయన పుష్పగుచ్ఛంతో నివాళులర్పించనున్నారు. ప్రధాని మోడీతో సమావేశం నిర్వహించి, ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. అదే రోజు సాయంత్రం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథి గౌరవార్థం రాష్ట్ర విందును నిర్వహిస్తారు.
రిపబ్లిక్ డే రోజున ఆయన రిపబ్లిక్ డే పరేడ్కు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈజిప్టు సైనిక బృందం ఇతర బృందాలతో కలిసి రాజ్పథ్పై కవాతు చేస్తుంది. రాష్ట్రపతి భవన్లో అధ్యక్షుడు ముర్ము నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఈజిప్టు అధ్యక్షుడు హాజరవుతారు. ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్తో కూడా సమావేశం కానున్నారు. భారతదేశంలోని వ్యాపార వర్గాలతో ఆయన సంభాషించనున్నారు. ఆ తర్వాత జనవరి 27న తిరిగి కైరో చేరుకుంటారు. రెండు దేశాల మధ్య సంబంధాలు భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడానికి నిబద్ధత, రక్షణ, భద్రత, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కలయికతో సహా వివిధ రంగాలలో సహకారంపై ఆధారపడి ఉంటాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో