Renu Desai Meets Telangana Minister Konda Surekha: నేడు శుక్రవారం జులై 26న ప్రముఖ నటి, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసింది. హైదరాబాదులో కొండా సురేఖ ఉన్న ఇంటికి వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ వన్నెప్రాణుల సంక్షేమం, పర్యావరణం, ఆధ్యాత్మిక రంగాలలో లాంటి అనేక విషయాలపై వారు చర్చించారు. ఇకపోతే రేణుదేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వెరీ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ గా ఉన్న ఆవిడ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నెలకొల్పిన గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ కొండా సురేఖకు వివరించింది.
Lok Sabha: కోర్టుల్లో పెండింగ్ కేసులపై కేంద్రం కీలక ప్రకటన.. ఎన్ని కేసులున్నాయంటే..!
ఈ మాట ముచ్చట ముగిసిన తర్వాత రేణు దేశాయను కొండ సురేఖ ఘనంగా సన్మానించింది. పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు, పూలు , పండ్లు అందజేసి ఆమెను సత్కరించింది. ఇకపోతే కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించుకున్న గొలుసుని రేణు దేశాయికి ఆవిడ చేతులతో అలంకరించింది మంత్రి సురేఖ.
Pickle In Hotel Meals: హోటల్ భోజనంలో ఊరగాయ పెట్టలేదని కోర్టులో కేసు.. చివరకు?
ఈ సందర్భంగా రేణు దేశాయ్ కొండ కుటుంబ సభ్యులు ఆమెపై చూపించిన ప్రేమాభిమానాల పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఆవిడ కేవలం ఉన్నట్టుగా మాత్రమే కాకుండా జంతు ప్రేమికురాలుగా పర్యావరణ ప్రేమికురాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందుకు సంబంధించి పలువురి దాతలు దగ్గర విరాళాలు కూడా సేకరించారు. రజక ఆవిడ సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ట్రోలింగ్స్ కారణంగా ట్విట్టర్ ఫేస్బుక్ ఖాతాలను డియాక్టివేట్ చేసింది. కేవలం సామాజిక సేవల కార్యక్రమాల కోసం తన ఇంస్టాగ్రామ్ కాదను కొనసాగిస్తుంది.
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ @iam_RenuDesai రేణు దేశాయ్ శుక్రవారం అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల పై చర్చించారు. pic.twitter.com/Xdc7CK0lSg
— Konda Surekha (@IKondaSurekha) July 26, 2024