NTV Telugu Site icon

Shahrukh Khan : షారూఖ్‎కు షాక్.. కోర్టు ఏమన్నదంటే

కలీలయ

కలీలయ

Shahrukh Khan : ఈ ఏడాది మొదట్లో షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో తన తదుపరి చిత్రం ‘జవాన్’ని ప్రస్తుత ఏడాది మధ్యలో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే, అదే సమయంలో సినిమా షూటింగ్‌కి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్‌లు సోషల్ ప్లాట్‌ఫామ్‌లో వైరల్ కావడంతో అతని టీమ్ షాక్ అయ్యింది. దీనిపై రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ విషయంలో కోర్టు షారుక్‌కి రిలీఫ్ ఇస్తూ తీర్పు చెప్పింది. తక్షణమే సోషల్ మీడిమా ప్లాట్‌ఫాం నుండి లీక్ అయిన క్లిప్‌లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. ‘జవాన్’ కాపీరైట్‌ను ఉల్లంఘించకుండా కేబుల్ టీవీ ప్లాట్‌ఫారమ్, డైరెక్ట్ టు హోమ్, వెబ్‌సైట్‌లతో పాటు ‘జాన్ డో’ డిఫెన్స్‌ను కోర్టు నిరోధించింది. షారుఖ్ మరియు గౌరీ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున ఒక పిటిషన్ దాఖలు చేయబడింది, దానిపై జస్టిస్ సి హరిశంకర్ తీర్పును వెల్లడించారు.

Read Also: Anchor Sreemukhi: పెళ్లికూతురుగా శ్రీముఖి అదుర్స్.. వేదిక ఎక్కడంటే

గతంలో ‘జవాన్’ చిత్రానికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఒక క్లిప్‌లో, షారుక్ ఫైట్ సీక్వెన్స్ ఉంది. రెండవ క్లిప్‌లో, షారుఖ్‌తో ప్రధాన నటి నయనతార కనిపించింది. ప్రస్తుతం.. షారుక్, అతని బృందానికి కోర్టు ఆదేశాలతో కొంత ఉపశమనం లభించింది. ఈ చిత్రానికి సౌత్ ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో షారుక్‌తో పాటు నయనతార, విజయ్ సేతుపతి కనిపించనున్నారు. ఇది కాకుండా తలపతి విజయ్, అల్లు అర్జున్ అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read Also: Kushi Movie : విజయ్ దేవరకొండ – సమంత ‘ఖుషీ’ మూవీ స్టోరీ లీక్

ఈ సినిమా క్లిప్ లీక్ కావడంతో ‘జవాన్’ వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా వాయిదా పడలేదని, అనుకున్న తేదీనే అంటే జూన్ 2న విడుదల కానుందని.. దీంతో పాటు రెండు వారాల పాటు సినిమా ప్రమోషన్ కూడా గట్టిగానే ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి ముందుగా మేలో సినిమా ప్రోమోను విడుదల చేయనున్నారు. అనంతరం ట్రైలర్‌, పాటలను విడుదల చేయనున్నారు.