Hinduja Group: హిందూజా కుటుంబానికి ఊరట.. మానవ అక్రమ రవాణా కేసులో నిర్దోషులుగా ప్రకటన
- తమ ఫిర్యాదులను ఉపసంహరించుకున్న ఫిర్యాదుదారులు
- తమకు తెలియకుండా తప్పుడు సంతకాలు చేసి కేసు బనాయించారని కోర్టుకు తెలిపిన ఫిర్యాదుదారులు
- తమకు అర్థం కాని పత్రాలపై సంతకం చేశామని సాక్ష్యం
- హిందూజా కుటుంబ సభ్యులను నిర్దోషులుగా తేల్చిన ఉన్నత న్యాయస్థానం
హిందూజా కుటుంబానికి పెద్ద ఊరట లభించింది. మానవ అక్రమ రవాణా ఆరోపణలపై హిందుజా కుటుంబానికి చెందిన నలుగురికి జూన్ 21న స్విస్ కోర్టు శిక్ష విధించింది. కానీ ఒక రోజు తర్వాత ఉన్నత న్యాయస్థానం వారిపై అన్ని అభియోగాల నుంచి నిర్దోషిగా ప్రకటించింది. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను ఉపసంహరించుకున్నారు. తమకు తెలియకుండా తప్పుడు సంతకాలు చేసి కేసు బనాయించారని కోర్టుకు వారు తెలిపారు. బ్రిటన్లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన హిందూజా కుటుంబానికి భారత్తోనూ సంబంధాలు ఉన్నాయి.
READ MORE: NEET: నీట్పై సోమవారం ఉన్నత స్థాయి కమిటీ తొలి భేటీ!
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
హిందూజా కుటుంబానికి చెందిన నలుగురిపై మోపిన అత్యంత తీవ్రమైన అభియోగం మానవ అక్రమ రవాణాను నిన్న కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారులు ఎవరూ లేరని, తమకు అర్థం కాని పత్రాలపై సంతకం చేశారని ఈ ఫిర్యాదుదారులు కోర్టులో తెలిపారు. హిందూజా కుటుంబ సభ్యులు తమతో “గౌరవంతో.. కుటుంబంలాగా” వ్యవహరించారని వారందరూ మరింత సాక్ష్యమిచ్చారు.
READ MORE: Pawan Kalyan: రేపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సినీ నిర్మాతల భేటీ
కాగా.. బ్రిటన్లో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత సంతతికి చెందిన హిందుజా కుటుంబానికి ఇటీవల షాక్ తగిలింది. స్విట్జర్లాండ్ జెనీవాలోని విల్లాలో పనిచేసే సిబ్బందిపై శ్రమదోపిడీకి పాల్పడ్డారనే కేసులో ఆ కుటుంబంలోని నలుగురికి కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రకాశ్ హిందుజా, ఆయన సతీమణి కమల్కు నాలుగున్నరేళ్లు, కుమారుడు అజయ్, కోడలు నమ్రతకు నాలుగేళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది. తీర్పు సమయంలో వారెవరూ కోర్టులో లేరు. అదేవిధంగా కుటుంబ వ్యాపార నిర్వాహకుడు నజీబ్ జియాజీకి న్యాయస్థానం 18 నెలల సస్పెండెడ్ శిక్ష విధించింది. దీంతో ఆ కుటుంబం ఉన్నత న్యాయస్థానానికి వెళ్లింది. వారందరినీ నిర్దోషులగా ఉన్నత న్యాయస్థానం తేల్చింది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!