Hinduja Group: హిందూజా కుటుంబానికి ఊరట.. మానవ అక్రమ రవాణా కేసులో నిర్దోషులుగా ప్రకటన
- తమ ఫిర్యాదులను ఉపసంహరించుకున్న ఫిర్యాదుదారులు
- తమకు తెలియకుండా తప్పుడు సంతకాలు చేసి కేసు బనాయించారని కోర్టుకు తెలిపిన ఫిర్యాదుదారులు
- తమకు అర్థం కాని పత్రాలపై సంతకం చేశామని సాక్ష్యం
- హిందూజా కుటుంబ సభ్యులను నిర్దోషులుగా తేల్చిన ఉన్నత న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూజా కుటుంబానికి పెద్ద ఊరట లభించింది. మానవ అక్రమ రవాణా ఆరోపణలపై హిందుజా కుటుంబానికి చెందిన నలుగురికి జూన్ 21న స్విస్ కోర్టు శిక్ష విధించింది. కానీ ఒక రోజు తర్వాత ఉన్నత న్యాయస్థానం వారిపై అన్ని అభియోగాల నుంచి నిర్దోషిగా ప్రకటించింది. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను ఉపసంహరించుకున్నారు. తమకు తెలియకుండా తప్పుడు సంతకాలు చేసి కేసు బనాయించారని కోర్టుకు వారు తెలిపారు. బ్రిటన్లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన హిందూజా కుటుంబానికి భారత్తోనూ సంబంధాలు ఉన్నాయి.
READ MORE: NEET: నీట్పై సోమవారం ఉన్నత స్థాయి కమిటీ తొలి భేటీ!
Also Read
- ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
హిందూజా కుటుంబానికి చెందిన నలుగురిపై మోపిన అత్యంత తీవ్రమైన అభియోగం మానవ అక్రమ రవాణాను నిన్న కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారులు ఎవరూ లేరని, తమకు అర్థం కాని పత్రాలపై సంతకం చేశారని ఈ ఫిర్యాదుదారులు కోర్టులో తెలిపారు. హిందూజా కుటుంబ సభ్యులు తమతో “గౌరవంతో.. కుటుంబంలాగా” వ్యవహరించారని వారందరూ మరింత సాక్ష్యమిచ్చారు.
READ MORE: Pawan Kalyan: రేపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సినీ నిర్మాతల భేటీ
కాగా.. బ్రిటన్లో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత సంతతికి చెందిన హిందుజా కుటుంబానికి ఇటీవల షాక్ తగిలింది. స్విట్జర్లాండ్ జెనీవాలోని విల్లాలో పనిచేసే సిబ్బందిపై శ్రమదోపిడీకి పాల్పడ్డారనే కేసులో ఆ కుటుంబంలోని నలుగురికి కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రకాశ్ హిందుజా, ఆయన సతీమణి కమల్కు నాలుగున్నరేళ్లు, కుమారుడు అజయ్, కోడలు నమ్రతకు నాలుగేళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది. తీర్పు సమయంలో వారెవరూ కోర్టులో లేరు. అదేవిధంగా కుటుంబ వ్యాపార నిర్వాహకుడు నజీబ్ జియాజీకి న్యాయస్థానం 18 నెలల సస్పెండెడ్ శిక్ష విధించింది. దీంతో ఆ కుటుంబం ఉన్నత న్యాయస్థానానికి వెళ్లింది. వారందరినీ నిర్దోషులగా ఉన్నత న్యాయస్థానం తేల్చింది.
తాజావార్తలు
-
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
-
Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!