Jio Recharge: నెలకు కేవలం రూ.81కే అపరిమిత కాల్స్.. బేసిక్ యూజర్ల కోసం ప్రత్యేక ప్లాన్ విడుదల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Recharge: భారతదేశంలో ప్రముఖంగా కొనసాగుతున్న రిలయన్స్ జియో (Reliance Jio) దేశంలోని మొబైల్ నెట్వర్క్ విభాగంలో తక్కువ కాలంలో తన ప్రభావాన్ని విస్తరించింది. 2016లో ప్రారంభమైన ఈ కంపెనీ మొదట ఉచిత ప్లాన్స్, తక్కువ ధరల డేటా ప్లాన్లు, ఉచిత వాయిస్ కాల్స్తో భారీ స్థాయిలో వినియోగదారులను ఆకర్షించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 46 కోట్ల మంది మొబైల్ యూజర్లను కలిగి ఉండగా.. జియో నెట్వర్క్ ప్రపంచంలోని పలు దేశాల్లోనూ తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన సేవలందించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఇటీవల కాలంలో రిలయన్స్ జియో కస్టమర్ గ్రోత్లో కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. కంపెనీ టారిఫ్లను పెంచడమే. టారిఫ్లు పెరిగిన నేపథ్యంలో చాలామంది వినియోగదారులు ప్రత్యామ్నాయంగా బీఎస్ఎన్ఎల్ వంటి నెట్వర్క్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం సేవలు పొందాలనుకునే యూజర్లను ఆకర్షించేందుకు జియో తాజాగా రూ.895 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ను ప్రకటించింది.
Read Also: Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
అయితే, ఇది ప్రత్యేకంగా జియో భారత్ మొబైల్ యూజర్ల కోసం రూపొందించబడింది. ఇక ఈ రూ.895 ప్లాన్ వివరాలను చూసినట్లయితే.. ఈ ప్లాన్ మొత్తం 336 రోజులు (సుమారు 11 నెలలు) వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్లకు అనిమిత కాల్స్ లభిస్తాయి. ఇక నెలకు 2GB హైస్పీడ్ ఇంటర్నెట్, మొత్తంగా 24GB డేటా అందించబడుతోంది. అలాగే రోజుకు 50 ఉచిత ఎస్ఎంఎస్లు ఇవ్వబడుతాయి. ఈ ప్లాన్ ముఖ్యంగా బేసిక్ మొబైల్ యూజర్లను టార్గెట్ చేసి తీసుకొచ్చినదిగా చెబుతున్నారు. తక్కువ ధరలో, ఎక్కువ కాలం సేవలు అందాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన పోటీదారులకు జియో గట్టిపోటీ ఇవ్వాలని చూస్తోంది. కాగా, ఈ కొత్త ప్లాన్ స్మార్ట్ఫోన్ యూజర్లకు మాత్రం అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. మౌలిక మొబైల్ వినియోగదారుల కోసం మాత్రమే ఈ ఆఫర్ను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. మొత్తంగా, తక్కువ డేటా అవసరమున్న ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలంగా నిలవనుంది.
తాజావార్తలు
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!