Site icon NTV Telugu

Reliance Share: ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని నిలిపిన రిలయన్స్‌ .. 55శాతం పెరిగిన సంపద

Reliance Mukesh Ambani

Reliance Mukesh Ambani

Reliance Share: భారత స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరిట మరో సరికొత్త రికార్డు నమోదైంది. భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.20 లక్షల కోట్లు దాటిన తొలి భారతీయ కంపెనీగా అవతరించింది. ఈ అద్భుత రికార్డును చేరుకునే ప్రయాణంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీతో పాటు తన పెట్టుబడిదారులను కూడా ధనవంతులను చేసింది.

లక్ష కోట్ల రూపాయల కంపెనీల క్లబ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేరడం దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగింది. మొదటిసారిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 2005లో లక్ష కోట్ల రూపాయల MCAPని సాధించింది. ప్రస్తుతం కంపెనీ విలువ రూ.20 లక్షల కోట్లు దాటింది. రూ.లక్ష కోట్ల నుంచి రూ.20 లక్షల కోట్ల విలువైన ఈ ప్రయాణంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఇన్వెస్టర్లకు దాదాపు 30 రెట్లు రిటర్న్స్ ఇచ్చింది.

Read Also:RC 16: బుచ్చి మావా… నువ్వు కొట్టే హిట్ సౌండ్ పాన్ వరల్డ్ వినిపించాలి…

నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ప్రారంభ సెషన్‌లో 0.53 శాతం నష్టంతో రూ.2,945 దగ్గర ట్రేడవుతోంది. నేటి స్వల్ప పతనం కారణంగా, కంపెనీ ఎమ్‌క్యాప్ కూడా రూ.20 లక్షల కోట్ల నుంచి రూ.19.93 లక్షల కోట్లకు స్వల్పంగా తగ్గింది. అయితే, ఒక రోజు క్రితం ఈ షేర్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 2,969.45కి చేరుకుంది. ఎంక్యాప్ రూ. 20 లక్షల కోట్లను దాటింది.

దాదాపు 20 ఏళ్ల క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఒక షేరు ధర దాదాపు రూ.110 మాత్రమే. ఈ విధంగా చూస్తే, ఫిబ్రవరి 2005 నుండి ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 2,600 శాతం పెరిగింది. అంటే షేరు ధరలు 27 రెట్లు పెరిగాయి. జూలై 2002 నుండి ఇప్పటి వరకు, స్టాక్ దాదాపు 5,500 శాతం అంటే 56 రెట్లు బలపడింది. అప్పట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఒక షేర్ విలువ రూ.53 మాత్రమే.

Read Also:Sarfaraz Khan: సర్ఫరాజ్ సతీమణి భావోద్వేగం.. వీడియో వైరల్!

Exit mobile version