రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలని మూడు ఎమ్మెల్సీ మరియు తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగున్నాయి. ఇక ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 9వ తేదీన వెలువబనుండగా…. నవంబర్ 16 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
నవంబర్ 17వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండనుండగా.. నవంబరు 22వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ ఉండనుంది. ఇక నవంబర్ 29 న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా… నవంబర్ 29 వ తేదీ 5 గంటల నుంచి కౌంటింగ్ జరుగనుంది. అదే రోజు ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. డిసెంబర్ ఒకటో తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనుంది ఎన్నికల సంఘం.
