హుజురాబాద్ ఉప ఎన్నికల్లో…ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలతో పార్టీలు హోరెత్తిస్తున్నాయ్. ఇంటింటికి వెళ్లి…ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఆసక్తికర విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో 19 నామినేషన్లు తిరస్కరించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు నిలిచారు. ఈటల పేర్లతో ఉన్న ముగ్గురి నామినేషన్లు తిరస్కరించారు. ఈనెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరించారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజేందర్ పేర్లతో… మొత్తం నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.
బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. రాజేందర్ పేరుతో ఉన్న మరో ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వారి ఇంటి పేర్లు కూడా అచ్చం ఈటల మాదిరిగానే ఉన్నాయి. ఈ అనే అక్షరంతో అభ్యర్థుల ఇంటి పేర్లు ప్రారంభమవుతాయి. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఇమ్మడి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ తరపున ఈసంపల్లి రాజేందర్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ తరపున ఇప్పలపల్లి రాజేందర్…బరిలో నిలిచారు. ఈటల రాజేందర్కు పడే ఓట్లకు గండి కొట్టాలన్న ఉద్దేశంతోనే.. అదే పేరుతో ఉన్న అభ్యర్థులను వెతికి, వారితో నామినేషన్ వేయించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నానినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు…ఈటల పేర్లతో ఉన్న ముగ్గురి నామినేషన్లను తిరస్కరించారు.