మహిళల 76 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత మహిళా రెజ్లర్ రితికా క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఆమె 12-2తో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని టెక్నికల్ సుపీరియారిటీను ఓడించింది. మొదటి రౌండ్ నుంచి రితికా ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలో భారీ తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు క్వార్టర్ ఫైనల్స్లో కిర్గిజ్స్థాన్కు చెందిన రెజ్లర్ ఐపెరి మెడెట్ కీజీతో రెజ్లర్ రితికా తలపడనుంది. ఫ్రీస్టైల్ 76 కేజీల ప్రీక్వార్టర్ ఫైనల్తో తన ప్రచారాన్ని ప్రారంభించిన మహిళా రెజ్లర్ రితికా.. ఈ రోజు పారిస్ ఒలింపిక్స్లో మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది.
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్కు భారత రెజ్లర్..
- క్వార్టర్ ఫైనల్కు భారత రెజ్లర్
- మహిళల 76 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్కు చేరిన రితికా
- హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగినిపై 12-2 తేడాతో విజయం.