Kerala: ప్రభుత్వ కార్యాలయంలో రీల్స్..8మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
- కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని తిరువల్ల మున్సిపాలిటీ కార్యదర్శి రీల్స్ వైరల్
- ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగుల చిందులు
- స్పందించిన మున్సిపల్ సెక్రటరీ
- ఎనిమిది మందికి షోకాజ్ నోటీసుల జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు బాగా ఎడిక్ట్ అయ్యారు. ఈ పిచ్చి రోజు రోజుకూ ముదురుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రకరకాల వీడియోలు చేస్తూ..నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్, ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవటానికి తమ జీవితాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కొందరు లైక్స్ కోసం విన్యాసాలు చేస్తూ..ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఈ రీల్స్ పిచ్చి క్రమంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మొదలైంది. తాజాగా కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని తిరువల్ల మున్సిపాలిటీ కార్యదర్శి రీల్స్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఎనిమిది మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు డ్యాన్స్, పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయంలో డ్యాన్స్ చేస్తూ.. పాటలు పాడుతున్నట్లు వీడియోలో కనిపించింది. దీంతో ఉన్నతాధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు.
READ MORE: Nadendla Manohar: విలువలతో కూడిన రాజకీయాలు.. ప్రజలకు మార్పు చూపించాలనే మా ఆలోచన
Also Read
కాసేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మున్సిపల్ సెక్రటరీ దృష్టికి రావడంతో వెంటనే ఎనిమిది మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించారు. ఈ చర్యపై సెక్రటరీని మీడియా ప్రశ్నించగా.. ఈ చర్య గురించి తెలిసి తాను తన బాధ్యతను నిర్వర్తించానని చెప్పారు. అయితే బుధవారం నోటీసు అందజేయగా.. కార్యాలయం పని చేయని సమయంలో ఈ రీల్ను చేశామని.. ఆ ఉద్యోగులు చెప్పుకొచ్చారు. దీని వల్ల పని కోసం వచ్చే ప్రజలకు, వారి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!