Site icon NTV Telugu

Redmi A5 Airtel: ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్.. 6 వేలకే 5200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ షావోమీ ఫోన్!

Redmi A5 Airtel

Redmi A5 Airtel

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ దిగ్గజం షావోమికి చెందిన సబ్‌బ్రాండ్‌ రెడ్‌మీ ఎంట్రీ లెవల్‌లో ‘రెడ్‌మీ ఏ5’ స్మార్ట్‌ఫోన్‌ను గత ఏప్రిల్‌లో లాంచ్‌ చేసింది. 3జీబీ + 64జీబీ వేరియంట్‌ ధర రూ.6,499గా ఉంది. తాజాగా ఎయిర్‌టెల్ ఎడిషన్‌ లాంచ్ అయింది. ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్‌ అసలు ధర రూ.6,499. అయితే మీరు ఈ ఎయిర్‌టెల్ ఎడిషన్‌ ఫోన్‌ను రూ.5,999కు కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

రెడ్‌మీ ఏ5లో ఎయిర్‌టెల్ ముఖ్యమైన ప్రయోజనాలను కూడా అందిస్తోంది. వినియోగదారులు 7.5 శాతం తగ్గింపు, 50జీబీ ఉచిత డేటాను పొందుతారు. ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే ముందు మీరు షరతులను తెలుసుకోవాలి. ఇది 4జీకి మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది. సెకండరీ ఫోన్‌గా వాడుకోవాలనుకునే వారికి మంచి ఆప్షన్. రెడ్‌మీ ఏ5 భారతదేశంలో రూ.5,999కు కొనుగోలు చేయవచ్చు. ఇది 3జీబీ + 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. కొనుగోలు చేసిన తర్వాత రూ.299 రీఛార్జ్ అవసరం. ఎయిర్‌టెల్ సిమ్ కార్డుతో మాత్రమే ఇది వర్క్ అవుతుంది.

Also Read: Abhishek Sharma: అభిషేక్ శర్మ చరిత్ర.. అప్పుడే విరాట్ కోహ్లీ క్లబ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ!

రెడ్‌మీ ఏ5 ఫోన్ 6.88-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 650 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc T7250 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది. కంపెనీ రెండు సంవత్సరాల అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇచ్చింది. ఈ మొబైల్ ఫోన్ 5200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. 32MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. IP52 రేటింగ్‌ను కలిగి ఉంది.

Exit mobile version