GST : పెళ్లిళ్ల సీజన్ లో కేంద్రం షాక్.. బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తులపై 28శాతం జీఎస్టీ
- డిసెంబర్ 21 జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్
- ధరలు భారీగా పెంచేందుకు కేంద్రం ప్లాన్
- బట్టలు, సిగరెట్లు, కూల్ డ్రింక్స్ కొనాలంటే జేబులు ఖాళీ కావాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST : పెళ్లిళ్ల సీజన్లో కేంద్ర ప్రభుత్వం నుండి షాక్ ఉండవచ్చు, వాస్తవానికి డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉంది. బ్రాండెడ్ దుస్తులపై జీఎస్టీ పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఒక వేళ మీరు గనుక పెళ్లి ఫిక్స్ చేసుకున్నట్లు అయితే డిసెంబర్ నెలకు ముందే షాపింగ్ చేయడం మంచింది. ఆ తర్వాత పెళ్లి బట్టలు కొనాలంటే కాస్ట్లీగా మారనున్నాయి. ప్రస్తుతం, రెడీమేడ్ దుస్తులపై నాలుగు శ్లాబ్లలో జీఎస్టీ వేర్వేరుగా వసూలు చేయబడుతోంది. ఇందులో పన్ను 5 నుండి 28 శాతం వరకు ఉంటుంది. డిసెంబర్ 21న జరిగే సమావేశం తర్వాత మంత్రుల బృందం (జిఓఎం) బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాలపై పన్ను వసూళ్లను పెంచే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 4 శ్లాబులుగా చేసినప్పటికీ, రెడీమేడ్ దుస్తులపై మాత్రం మూడు శ్లాబుల్లో జీఎస్టీ వర్తిస్తుంది. రూ. 1,500 వరకు ఉన్న దుస్తులపై 5శాతం జీఎస్టీ, రూ. 1,500-10,000 మధ్య బట్టలపై 18శాతం జీఎస్టీ, రూ. 10,000 కంటే ఎక్కువ ఉన్న దుస్తులపై 28శాతం జీఎస్టీ విధించబడుతుంది. ప్రస్తుతం, మూడు స్లాబ్లలో రెడీమేడ్ దుస్తులపై జిఎస్టి వర్తిస్తుంది. దీనికి సంబంధించి డిసెంబర్ 21వ తేదీన జరిగే జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రుల బృందం రెడీమేడ్ దుస్తులపై పన్ను శ్లాబును పెంచే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 5 శాతం పన్ను స్లాబ్ను తొలగించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 21 తర్వాత రెడీమేడ్ దుస్తులపై 18 శాతం, 28 శాతం జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
- MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
- Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
బ్రాండెడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ
ప్రస్తుతం బట్టల ధరలను బట్టి మూడు శ్లాబులుగా ప్రభుత్వం బట్టలపై జీఎస్టీని వసూలు చేస్తోంది, అయితే డిసెంబర్ 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం బ్రాండెడ్ దుస్తులను 28 శాతం శ్లాబ్లో ఉంచవచ్చు, ఆ తర్వాత బ్రాండెడ్ దుస్తులు మునుపటి కంటే ఖరీదైనది అవుతుంది.
148 వస్తువులు ఖరీదైనవి కావచ్చు
148 వస్తువులపై జీఎస్టీ రేట్లలో మార్పులను మంత్రుల బృందం జీఎస్టీ కౌన్సిల్కు ప్రతిపాదించగా, జీఎస్టీ కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. మంత్రుల బృందం నివేదికపై డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ఇందులో పాల్గొంటారు.
Read Also:Eknath Shinde: ఆందోళనకరంగా ఏక్నాథ్ షిండే ఆరోగ్యం.. ఆసుపత్రికి తరలింపు
తాజావార్తలు
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!