ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నేడు రాత్రి 7:30 గంటలకు ఎలిమినేటర్ మ్యాచ్ ఆమదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ రాజస్థాన్ రాయల్స్ గెలిచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మొదటగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక ఆర్సీబీ బాటింగ్ దిగగా మొదట్లో బాగానే ఆడిన మందలో కాస్త వరుస వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ చివరకు నిర్ణిత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్స్ కోల్పోయి 172 గౌరవప్రదమైన స్కోర్ ను అందుకుంది.
OPPO Reno 12: మార్కెట్ లోకి వచ్చేస్తున్న Reno 12 సిరీస్.. వివరాలు ఇలా..
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 33 పరుగులు, ఫాఫ్ డు ప్లెసిస్ 17, రజత్ పాటిదార్ 34, మహిపాల్ లోమ్రోర్ 32, దినేశ్ కార్తీక్ 11, స్వప్నిల్ సింగ్ 9 నాట్ అవుట్, కరణ్ శర్మ 5 నాట్ అవుట్ గా పరుగులు చేసారు. ఇక రాజస్థాన్ బౌలర్లు విషయానికి వస్తే.. అవేష్ ఖాన్ 3 వికెట్స్, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్స్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మలు చెరో వికెట్ పడగొట్టారు. దింతో ఆర్ఆర్ టార్గెట్ 173 గా ఉంది.
Viral Video: రష్యన్ టూరిస్టుతో అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడిన భారతీయ కాబ్లర్..