RBI: ఖాతాదారులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంకులు మీకు రోజుకు రూ. 100 చెల్లింపు!
- న్యూ రూల్స్ తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఖాతాదారుల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించకుంటే జరిమానా
- ఖాతాదారులకు పరిహారంగా జరిమానా
- ఆర్బీఐ ఆదేశాలతో ఖాతాదారులకు బ్యాంకులు ఇకపై రోజుకు రూ. 100 చెల్లింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాచుకోవడం కోసం, లోన్స్, ప్రభుత్వ పథకాలు ఇలా వివిధ అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దాదాపు బ్యాంకు సేవలన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. బ్యాంకుకు వెళ్లకుండానే పనులు చక్కబెట్టేస్తున్నారు. కానీ కొన్నిసార్లు ఖాతాకు సంబంధించిన సమస్యలు, డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ పరిష్కారం కోసం బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు టెక్నికల్ సమస్య కారణంగా ఖాతాలో డబ్బు కట్ అయిపోయి రిఫండ్ అవడం లేట్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఖాతాదారుల సమస్యలను పరిష్కరించడంలో బ్యాంకులు జాప్యం చేస్తుంటాయి.
Read Also: Eric Garcetti: భారతదేశం నా హృదయాన్ని దోచుకుంది.. అమెరికా రాయబారి..
Also Read
దీనికి చెక్ పెట్టేందుకు బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఖాతాదారుల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించకుంటే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ జరిమానాను ఖాతాదారులకు పరిహారంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలతో ఖాతాదారులకు బ్యాంకులు ఇకపై రోజుకు రూ. 100 చెల్లించనున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు కస్టమర్ ఫిర్యాదులను ఒక నెలలోపు పరిష్కరించాలి. ఆ లోపు సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ.100 జరిమానా విధిస్తామని ఆర్బీఐ కొత్త ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Rahul Gandhi: కెవెంటర్స్ స్టోర్లో కాఫీ చేసుకుని తాగిన రాహుల్గాంధీ.. వీడియో వైరల్
బ్యాంకులు కస్టమర్లకు త్వరితగతిన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాక కస్టమర్ల క్రెడిట్ సమాచారాన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు పొందినట్లైతే ఈ విషయాన్ని వారికి ఈ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంకులు ఖాతాదారులకు లోన్ చెల్లించకుండా డీఫాల్ట్ గా ఉంటే ఈ విషయాన్ని 21 రోజుల్లో తెలియజేయాలి. అలా చేయకపోతే కస్టమర్లకు రోజుకు రూ. 100 పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ ఆదేశించింది. కాగా ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..