Rayapati Sambasiva Rao: నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు..! కానీ.. రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rayapati Sambasiva Rao: గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాలపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు పోటీ చేయమంటే నరసరావుపేట నుంచి పోటీ చేస్తానన్న ఆయన.. నేనిప్పుడు పోటీకి సిద్ధం.. గతంలో డబ్బుల్లేక ఓడాను.. ఇప్పుడు డబ్బులున్నాయని పేర్కొన్నారు. అయినా, ఈసారి డబ్బుల్లేకున్నా.. టీడీపీకి వేవ్ వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నా తనయుడు రంగబాబుకు సీటిమ్మని కోరుతున్నాం. రంగబాబుకు సత్తెనపల్లి ఇస్తారా..? పెదకూరపాడు ఇస్తారా..? అనేది చంద్రబాబు ఇష్టం అన్నారు.. ఇక, మా తమ్ముడు కూతురు రాయపాటి శైలజకూ టిక్కెట్ అడుగుతున్నాం… వాళ్లిద్దరికీ టికెట్లు ఇస్తే.. నాకు లేకున్నా పర్వాలేదన్నారు..
అయితే, నరసరావుపేటకు లోకల్ వాళ్లే అభ్యర్థిగా ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాయపాటి.. కడప నుంచి వచ్చే బీసీకి టిక్కెట్ ఎందుకివ్వాలి..? లోకల్ బీసీలు లేరా..? అని ప్రశ్నించారు. కడప నుంచి వచ్చి పోటీ చేస్తే నరసరావుపేటలో గెలవడం కష్టమన్న ఆయన.. నాకు ఇవ్వకుంటే వేరేవారికైనా టిక్కెట్ ఇవ్వండి.. కానీ, లోకల్ వాళ్లకే ఇవ్వాలన్నారు.. నేను ముసలోడినైన మాట వాస్తవమే.. కానీ, అన్ని చోట్లా తిరుగుతా అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కలిసే పని చేస్తాం.. వర్గాలు లేవని స్పష్టం చేశారు.. నేను ఏ ఇంఛార్జ్లకు వ్యతిరేకంగా.. వేరేవాళ్లను ప్రోత్సహించడంలేదన్నారు. ఏమైనా ఉంటే చంద్రబాబుకే చెబుతాను అన్నారు రాయపాటి.
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ఇక, మాచర్ల బ్రహ్మానంద రెడ్డికి ఇస్తామంటున్నారు.. కచ్చితంగా గెలుస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు రాయపాటి.. గురజాలలో ఎలా ఉంటుందో తెలియదన్న ఆయన.. ఏదైనా కరెప్షన్ లేని వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వడం మంచిదన్నారు. కొత్తవాళ్లకు అని కాదు.. కరెప్షన్ లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్నాకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా గెలుస్తారు.. మేమంతా సపోర్ట్ చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నాతో రాజీ లేదు.. ఏం లేదు.. పార్టీ కోసం పని చేస్తామన్న ఆయన.. కన్నా పదేళ్లు నన్ను ఏడిపించాడు.. ఆ తర్వాత కోర్టులో రాజీ పడ్డారు.. కన్నా.. చంద్రబాబునూ ఏడిపించాడు.. కానీ, కొన్ని కారణాల వల్ల పార్టీలో చేరారు. ఏదేమైనా చంద్రబాబు మాటే మాకు వేదం అని పేర్కొన్నారు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు.
తాజావార్తలు
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!
-
Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
-
Virat Kohli : ఇంగ్లాండ్ పై విరాట్ కోహ్లీ ఆడతాడా? గాయంపై కీలక అప్డేట్!
-
Astrology: కోపం త్వరగా వచ్చినా.. అంతే వేగంగా మర్చిపోయే 4 రాశులు ఇవేనా? మనసులో పగ పెట్టుకోరట!
-
Vivek Agarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై పెరిగిన భారత ప్రతిష్ఠ
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!