Rayachoti Terrorists: ఉగ్రవాదుల ఇళ్లలో మరోసారి తనిఖీలు.. వస్త్ర వ్యాపారం ముసుగులో..!
- అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కలకలం
- మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అరెస్టు
- ఉగ్రవాదుల నివాసాల్లో మరోసారి సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీలను ఐబీ అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరు ఉగ్రవాదుల నివాసాల్లో మంగళవారం జరిపిన సోదాల్లో భారీగా మందుగుండు సామగ్రి పట్టుబడింది. సిద్ధిక్ నివాసంలో 4 కిలోల ఆర్డీఎక్స్, డిటొనేటర్ వైర్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అలీ నివాసంలో పేలుళ్లకు ఉపయోగించే వైర్లను పోలిసులు గుర్తించారు.
గురువారం రాత్రి మరోసారి టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీల ఇళ్లను అన్నమయ్య జిల్లా పోలీసులు తనిఖీ చేశారు. సెల్ ఫోన్లు, వాకీటాకీలు, రేడియోలు, రిమోట్లు వంటి పరికరాలతో పాటు పలు పాస్ పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలతో పాటు పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
Also Read
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
Also Read: Kurnool Diamond: వ్యవసాయ కూలీకి దొరికిన విలువైన వజ్రం.. క్యూ కట్టిన వ్యాపారులు! ధర తెలిస్తే షాకే
పట్టుబడిన అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీల సెల్ఫోన్ల ఆధారంగా వారితో తరచుగా మాట్లాడేవారు, కలిసి తిరిగిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరు ఓ వ్యాపారితో పాటు ఓ ప్రజాప్రతినిధితో ఫోన్లలో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. ఈ ఇద్దరూ తమిళనాడులో వరుస బాంబు పేలుళ్లలో నిందితులుగా ఉన్నారు. దేశంలోని 3 ప్రధాన నగరాలతో పాటు రైలు మార్గాలను పేల్చడానికి ఇద్దరు పన్నాగం పన్నారు. వీరిద్దరూ తమిళనాడు నుంచి రాయచోటికి వచ్చి స్థిరపడ్డారు. 13 సంవత్సరాలుగా రాయచోటిలోనే ఉంటూ వస్త్ర వ్యాపారం ముసుగులో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!