Rayachoti Terrorists: ఉగ్రవాదుల ఇళ్లలో మరోసారి తనిఖీలు.. వస్త్ర వ్యాపారం ముసుగులో..!
- అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కలకలం
- మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అరెస్టు
- ఉగ్రవాదుల నివాసాల్లో మరోసారి సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీలను ఐబీ అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరు ఉగ్రవాదుల నివాసాల్లో మంగళవారం జరిపిన సోదాల్లో భారీగా మందుగుండు సామగ్రి పట్టుబడింది. సిద్ధిక్ నివాసంలో 4 కిలోల ఆర్డీఎక్స్, డిటొనేటర్ వైర్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అలీ నివాసంలో పేలుళ్లకు ఉపయోగించే వైర్లను పోలిసులు గుర్తించారు.
గురువారం రాత్రి మరోసారి టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీల ఇళ్లను అన్నమయ్య జిల్లా పోలీసులు తనిఖీ చేశారు. సెల్ ఫోన్లు, వాకీటాకీలు, రేడియోలు, రిమోట్లు వంటి పరికరాలతో పాటు పలు పాస్ పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలతో పాటు పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
Also Read: Kurnool Diamond: వ్యవసాయ కూలీకి దొరికిన విలువైన వజ్రం.. క్యూ కట్టిన వ్యాపారులు! ధర తెలిస్తే షాకే
పట్టుబడిన అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీల సెల్ఫోన్ల ఆధారంగా వారితో తరచుగా మాట్లాడేవారు, కలిసి తిరిగిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరు ఓ వ్యాపారితో పాటు ఓ ప్రజాప్రతినిధితో ఫోన్లలో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. ఈ ఇద్దరూ తమిళనాడులో వరుస బాంబు పేలుళ్లలో నిందితులుగా ఉన్నారు. దేశంలోని 3 ప్రధాన నగరాలతో పాటు రైలు మార్గాలను పేల్చడానికి ఇద్దరు పన్నాగం పన్నారు. వీరిద్దరూ తమిళనాడు నుంచి రాయచోటికి వచ్చి స్థిరపడ్డారు. 13 సంవత్సరాలుగా రాయచోటిలోనే ఉంటూ వస్త్ర వ్యాపారం ముసుగులో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం