Ravindra Jadeja: సర్ జడేజా అంటే ఆమాత్రం ఉంటది.. లక్ష్మణ్, గవాస్కర్ రికార్డులను కొల్లగొట్టిన జడ్డూ భాయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja: ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. టెస్టు సిరీస్లో 6వ స్థానంలో లేదా అంతకంటే దిగువ బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఈ సందర్భంగా భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ రికార్డును అధిగమించాడు. 2002లో వెస్టిండీస్ పర్యటనలో లక్ష్మణ్ 474 పరుగులు చేసిన రికార్డును జడేజా బద్దలు కొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్లో హాఫ్ సెంచరీ చేసి 500 పరుగుల మార్కును దాటేశాడు. దీంతో ఈ టెస్టు సిరీస్లో 500కి పైగా పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఇంతకుముందు ఈ ఘనత శుభ్మన్ గిల్ (754 పరుగులు), కేఎల్ రాహుల్ (532 పరుగులు)లకు దక్కగా, జడేజా 516 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.
Russia: ఓ వైపు 7.0 భూకంపం.. మరోవైపు 600 ఏళ్ల తర్వాత క్రషెనినికోవ్ అగ్ని పర్వతం విస్ఫోటనం..!
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
ఇంగ్లాండ్లో జరుగుతున్న ఓ టెస్టు సిరీస్లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన భారత ఆటగాడిగా జడేజా మరో మైలురాయిని అధిగమించాడు. సునీల్ గవాస్కర్ ఇంగ్లాండ్లో ఒకే సిరీస్లో 5 అర్ధశతకాలు చేసిన రికార్డును జడేజా 6 అర్ధశతకాలతో అధిగమించాడు. ఇదే రికార్డుతో వెస్టిండీస్కు చెందిన గెర్రీ అలెగ్జాండర్, పాకిస్థాన్కు చెందిన వసీం రాజా కూడా సమానంగా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పు తిప్పలు నిలకడగా ఆడిన జడేజా చివరకు జోష్ టంగ్ బౌలింగ్లో అవుటయ్యాడు.
Baby Movie Team : ఆనంద్, వైష్ణవికి వారితో గొడవ.. సద్దుమణిగినట్టేనా..?
ఇక చివరి మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ ఇంగ్లాండ్ కు 374 పరుగుల భారీ టార్గెట్ ను అందించింది. ఇక మ్యాచ్ మూడో రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 13.5 ఓవర్లలో 50 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. ఇక ఇంగ్లాండ్ విజయానికి 324 పరుగుల దూరంలో ఉంది. మరోవైపు భారత్ విజయానికి 9 వికెట్లు నెల కూల్చాల్సి ఉంది. భారత్ మ్యాచ్ ను ఎలాగైనా గెలిచి సిరీస్ ను 2-2తో సమంచేయాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..