Ravindra Jadeja: సర్ జడేజా అంటే ఆమాత్రం ఉంటది.. లక్ష్మణ్, గవాస్కర్ రికార్డులను కొల్లగొట్టిన జడ్డూ భాయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja: ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. టెస్టు సిరీస్లో 6వ స్థానంలో లేదా అంతకంటే దిగువ బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఈ సందర్భంగా భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ రికార్డును అధిగమించాడు. 2002లో వెస్టిండీస్ పర్యటనలో లక్ష్మణ్ 474 పరుగులు చేసిన రికార్డును జడేజా బద్దలు కొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్లో హాఫ్ సెంచరీ చేసి 500 పరుగుల మార్కును దాటేశాడు. దీంతో ఈ టెస్టు సిరీస్లో 500కి పైగా పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఇంతకుముందు ఈ ఘనత శుభ్మన్ గిల్ (754 పరుగులు), కేఎల్ రాహుల్ (532 పరుగులు)లకు దక్కగా, జడేజా 516 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.
Russia: ఓ వైపు 7.0 భూకంపం.. మరోవైపు 600 ఏళ్ల తర్వాత క్రషెనినికోవ్ అగ్ని పర్వతం విస్ఫోటనం..!
Also Read
- Bihar: ప్రశాంత్ కిషోర్కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్లో టఫ్ ఫైట్
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
- Head Coach: గౌతమ్ గంభీర్కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు..
- Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
ఇంగ్లాండ్లో జరుగుతున్న ఓ టెస్టు సిరీస్లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన భారత ఆటగాడిగా జడేజా మరో మైలురాయిని అధిగమించాడు. సునీల్ గవాస్కర్ ఇంగ్లాండ్లో ఒకే సిరీస్లో 5 అర్ధశతకాలు చేసిన రికార్డును జడేజా 6 అర్ధశతకాలతో అధిగమించాడు. ఇదే రికార్డుతో వెస్టిండీస్కు చెందిన గెర్రీ అలెగ్జాండర్, పాకిస్థాన్కు చెందిన వసీం రాజా కూడా సమానంగా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పు తిప్పలు నిలకడగా ఆడిన జడేజా చివరకు జోష్ టంగ్ బౌలింగ్లో అవుటయ్యాడు.
Baby Movie Team : ఆనంద్, వైష్ణవికి వారితో గొడవ.. సద్దుమణిగినట్టేనా..?
ఇక చివరి మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ ఇంగ్లాండ్ కు 374 పరుగుల భారీ టార్గెట్ ను అందించింది. ఇక మ్యాచ్ మూడో రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 13.5 ఓవర్లలో 50 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. ఇక ఇంగ్లాండ్ విజయానికి 324 పరుగుల దూరంలో ఉంది. మరోవైపు భారత్ విజయానికి 9 వికెట్లు నెల కూల్చాల్సి ఉంది. భారత్ మ్యాచ్ ను ఎలాగైనా గెలిచి సిరీస్ ను 2-2తో సమంచేయాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. ‘హృదయం మురళి’ ట్రైలర్ చూశారా?
-
Meta: సోషల్ మీడియా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! మెటాకు ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా?
-
Bihar: ప్రశాంత్ కిషోర్కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్లో టఫ్ ఫైట్
-
CM Revanth Reddy : కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు.. సీఎం రేవంత్కు లేఖ.!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!