Sexual Harassment: రూ.50 ఎర చూపి మైనర్ బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల శిక్ష
- ఉత్తరాఖండ్లో దారుణం
- ఓ మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై కోర్టు కఠిన చర్యలు
- నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
- రూ. 5000 జరిమానా విధింపు
- బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా.. జరిమానా కూడా విధించింది. ఈ కేసులో ప్రత్యేక, జిల్లా సెషన్స్ జడ్జి ధరమ్ సింగ్ తీర్పు చెప్పారు. రూ. 5000 జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో 30 రోజుల అదనపు సాధారణ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ POCSO మోహన్ పంత్ మాట్లాడుతూ.. ఈ ఘటన 2020 మే 13న సాయంత్రం 4 గంటలకు జరిగింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మైనర్ బాలికకు ఫోన్ చేసి.. ఆమెకు రూ. 50 ఇచ్చి సమీపంలోని దుకాణంలో కొన్ని వస్తువులను తీసుకురమ్మని చెప్పాడు.
Read Also: AP Assembly Session: అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్ లేనట్టే..!?
Also Read
అయితే.. ఆ వస్తువులు తీసుకుని నిందితుడి ఇంటికి వెళ్లగా.. నిందితుడు ఆమెను తన గదిలోకి ఈడ్చుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. అంతేకాకుండా.. బాలికను దారుణంగా కొట్టాడు. దీంతో బాలిక శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. అనంతరం.. బాధితురాలి తల్లి, కుటుంబ సభ్యులు నిందితుడి గదికి చేరుకున్నారు. దీంతో.. వెంటనే నిందితుడు బాలికను వదిలిపెట్టాడు. ఈ ఘటనపై గ్రామపెద్దలు రెవెన్యూ సబ్ ఇన్స్పెక్టర్ గౌచర్కు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రెవెన్యూ సబ్ ఇన్స్పెక్టర్ గౌచర్ నిందితుడిని అరెస్టు చేశారు. కాగా.. ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్న నిందితుడికి కోర్టు కీలక తీర్పునిచ్చింది.
Read Also: Kamal Haasan: ఇంకా దొరకని అవార్డ్స్ చాలా ఉన్నాయి..కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?