NTV Telugu Site icon

Ramayanam : అంచనాలను పెంచేస్తున్న రామాయణం.. మొదటి పార్ట్ కు అన్ని కోట్లా?

Ramayanam

Ramayanam

రామాయణం కథతో ఎన్నో సినిమాలు వస్తున్నా కూడా ఇప్పటికి కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి.. బాలీవుడ్ లో రామాయణం కథతో ఇప్పుడు మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమాగా రామాయణం రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతున్న విషయం తెలిసిందే..

ప్రస్తుతం పాన్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ బడ్జెట్ దాదాపు 835 కోట్లు అని తెలుస్తోంది. ఈ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.. ఇక ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారని తెలుసు.. ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

ఈ సినిమా బడ్జెట్ 835 కోట్లకు రావడం మామూలు విషయం కాదు.. రామాయణం: పార్ట్ 1’ బడ్జెట్ 835 కోట్లు అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కేవలం 600 రోజులు మాత్రమే షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ఇంత బడ్జెట్ అన్న విషయం వైరల్ గా మారింది..