Ram Mandir: అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త.. జనవరి 19 నుంచి 1000 ప్రత్యేక రైళ్లు
Ram Mandir: నూతనంగా నిర్మించిన రామజన్మభూమి ఆలయ ప్రారంభోత్సవానికి అయోధ్య అంతా సిద్ధమైంది. భక్తుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఈ రైళ్ల ఆపరేషన్ జనవరి 19 నుండి ప్రారంభమవుతుంది. మహా ప్రారంభోత్సవం.. తర్వాత వచ్చే 100 రోజుల పాటు కొనసాగుతుంది. తద్వారా భక్తులు ఈ పవిత్ర నగరానికి చేరుకోవచ్చచు. ఈ ప్రత్యేక రైళ్లు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, నాగ్పూర్, లక్నో, జమ్మూ వంటి ప్రధాన నగరాల నుండి యాత్రికుల కోసం అయోధ్యకు నడుస్తాయి. డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని మరిన్ని రైళ్లు నడుపబడుతాయని రైల్వే పేర్కొంది. పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారని దృష్టిలో ఉంచుకుని అయోధ్య స్టేషన్ కూడా రీడిజైన్ చేయబడింది. ప్రత్యేక రైళ్లతో పాటు, రైల్వేలోని క్యాటరింగ్, టికెటింగ్ విభాగం కూడా ఈ 10-15 రోజుల ప్రారంభోత్సవంలో యాత్రికులకు 24 గంటలూ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Read Also:TS Assembly: గరం గరంగా అసెంబ్లీ.. కేటీఆర్, హరీష్ పై రేవంత్ ఫైర్
Also Read
- Fish Price Down: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ట్యూనా ఫిష్ ధర..
- AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
- TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్
- Suvendu Adhikari: రాజీనామా చేయనన్న మమత ప్రకటనపై సువేందు అధికారి ఏమన్నారంటే..!
రామాలయ ప్రారంభోత్సవం తర్వాత భక్తుల డిమాండ్ను తీర్చడానికి అధికారులు అనేక ఫుడ్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ ఇప్పుడు ప్రతిరోజూ దాదాపు 50,000 మంది వ్యక్తుల రాకపోకలను నిర్వహించగలదు. జనవరి 15 నాటికి ఇది పూర్తిగా సిద్ధమవుతుంది. శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన ఒక రోజు తర్వాత జనవరి 23 నుండి ఆలయం ప్రజలకు తెరిచి ఉంటుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఆలయాన్ని జనవరి 22, 2024న ప్రారంభించనున్నారు. ఆలయ ప్రాంగణంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లకు రామమందిర్ ట్రస్ట్ బాధ్యత వహిస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే భక్తులకు 320 అడుగుల దూరం నుండి రాముడిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ప్రారంభోత్సవం రోజున రామభక్తులందరికీ ప్రసాదం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులను దర్శనం కోసం నాలుగు లైన్లలో ఏర్పాటు చేయగా, ఒక్కరోజులో లక్షన్నర నుంచి రెండున్నర లక్షల మంది శ్రీ రాముని దర్శనం చేసుకునే అవకాశం ఉంది.
Read Also:Harish Rao: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిందే టీఆర్ఎస్..
తాజావార్తలు
-
Fish Price Down: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ట్యూనా ఫిష్ ధర..
-
AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి ‘నాబార్డ్’ ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
-
PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
-
Karuppu : మే 14న ‘వీరభద్రుడు’కి లైన్ క్లియర్
-
Chiranjeevi: ఆర్.బి. చౌదరి ఆకస్మిక దుర్మరణం మనసుని కలిచివేసింది!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!