Ram Mandir: అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త.. జనవరి 19 నుంచి 1000 ప్రత్యేక రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: నూతనంగా నిర్మించిన రామజన్మభూమి ఆలయ ప్రారంభోత్సవానికి అయోధ్య అంతా సిద్ధమైంది. భక్తుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఈ రైళ్ల ఆపరేషన్ జనవరి 19 నుండి ప్రారంభమవుతుంది. మహా ప్రారంభోత్సవం.. తర్వాత వచ్చే 100 రోజుల పాటు కొనసాగుతుంది. తద్వారా భక్తులు ఈ పవిత్ర నగరానికి చేరుకోవచ్చచు. ఈ ప్రత్యేక రైళ్లు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, నాగ్పూర్, లక్నో, జమ్మూ వంటి ప్రధాన నగరాల నుండి యాత్రికుల కోసం అయోధ్యకు నడుస్తాయి. డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని మరిన్ని రైళ్లు నడుపబడుతాయని రైల్వే పేర్కొంది. పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారని దృష్టిలో ఉంచుకుని అయోధ్య స్టేషన్ కూడా రీడిజైన్ చేయబడింది. ప్రత్యేక రైళ్లతో పాటు, రైల్వేలోని క్యాటరింగ్, టికెటింగ్ విభాగం కూడా ఈ 10-15 రోజుల ప్రారంభోత్సవంలో యాత్రికులకు 24 గంటలూ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Read Also:TS Assembly: గరం గరంగా అసెంబ్లీ.. కేటీఆర్, హరీష్ పై రేవంత్ ఫైర్
Also Read
- Trump: భారత్ ఎన్నికల వ్యవస్థ సూపర్.. ట్రంప్ ప్రశంసలే.. ప్రశంసలు
- IND vs SL 1st Test: గాలె టెస్ట్లో భారత్కు షాక్.. రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకే చేతులెత్తేశారు..
- Imran Khan: తక్షణమే ఇమ్రాన్ఖాన్ను ఆస్పత్రికి తరలించండి.. సుప్రీంకోర్టు ఆదేశం
- AP Cabinet Decisions 2026: బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. 34 శాతం అమలుకు గ్రీన్ సిగ్నల్!
రామాలయ ప్రారంభోత్సవం తర్వాత భక్తుల డిమాండ్ను తీర్చడానికి అధికారులు అనేక ఫుడ్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ ఇప్పుడు ప్రతిరోజూ దాదాపు 50,000 మంది వ్యక్తుల రాకపోకలను నిర్వహించగలదు. జనవరి 15 నాటికి ఇది పూర్తిగా సిద్ధమవుతుంది. శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన ఒక రోజు తర్వాత జనవరి 23 నుండి ఆలయం ప్రజలకు తెరిచి ఉంటుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఆలయాన్ని జనవరి 22, 2024న ప్రారంభించనున్నారు. ఆలయ ప్రాంగణంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లకు రామమందిర్ ట్రస్ట్ బాధ్యత వహిస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే భక్తులకు 320 అడుగుల దూరం నుండి రాముడిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ప్రారంభోత్సవం రోజున రామభక్తులందరికీ ప్రసాదం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులను దర్శనం కోసం నాలుగు లైన్లలో ఏర్పాటు చేయగా, ఒక్కరోజులో లక్షన్నర నుంచి రెండున్నర లక్షల మంది శ్రీ రాముని దర్శనం చేసుకునే అవకాశం ఉంది.
Read Also:Harish Rao: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిందే టీఆర్ఎస్..
తాజావార్తలు
-
Varanasi: ‘వారణాసి’పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. షూటింగ్ వెనుక సీక్రెట్స్ అన్నీ బయట పెడతాడట?
-
Trump: భారత్ ఎన్నికల వ్యవస్థ సూపర్.. ట్రంప్ ప్రశంసలే.. ప్రశంసలు
-
Ramayana : హాలీవుడ్లో క్రేజ్ కోసం అంత ఖర్చు అవసరమా?
-
IND vs SL 1st Test: గాలె టెస్ట్లో భారత్కు షాక్.. రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకే చేతులెత్తేశారు..
-
OG 2 నుంచి వరుస ట్రీట్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు మాస్ కిక్ స్టార్ట్!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!