Ram Mandir: అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త.. జనవరి 19 నుంచి 1000 ప్రత్యేక రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: నూతనంగా నిర్మించిన రామజన్మభూమి ఆలయ ప్రారంభోత్సవానికి అయోధ్య అంతా సిద్ధమైంది. భక్తుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఈ రైళ్ల ఆపరేషన్ జనవరి 19 నుండి ప్రారంభమవుతుంది. మహా ప్రారంభోత్సవం.. తర్వాత వచ్చే 100 రోజుల పాటు కొనసాగుతుంది. తద్వారా భక్తులు ఈ పవిత్ర నగరానికి చేరుకోవచ్చచు. ఈ ప్రత్యేక రైళ్లు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, నాగ్పూర్, లక్నో, జమ్మూ వంటి ప్రధాన నగరాల నుండి యాత్రికుల కోసం అయోధ్యకు నడుస్తాయి. డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని మరిన్ని రైళ్లు నడుపబడుతాయని రైల్వే పేర్కొంది. పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారని దృష్టిలో ఉంచుకుని అయోధ్య స్టేషన్ కూడా రీడిజైన్ చేయబడింది. ప్రత్యేక రైళ్లతో పాటు, రైల్వేలోని క్యాటరింగ్, టికెటింగ్ విభాగం కూడా ఈ 10-15 రోజుల ప్రారంభోత్సవంలో యాత్రికులకు 24 గంటలూ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Read Also:TS Assembly: గరం గరంగా అసెంబ్లీ.. కేటీఆర్, హరీష్ పై రేవంత్ ఫైర్
Also Read
- Kommidi Narasimha Reddy: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు!
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్కు నివాళి
- Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రం సూపర్.. ఆ ఒక్క లోపం సరిదిద్దుకుంటే ఇంగ్లండ్కు చుక్కలే..!
- FIFA World Cup 2026: పోర్చుగల్ ఓటమి.. ముగిసిన రొనాల్డో ప్రయాణం.!
రామాలయ ప్రారంభోత్సవం తర్వాత భక్తుల డిమాండ్ను తీర్చడానికి అధికారులు అనేక ఫుడ్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ ఇప్పుడు ప్రతిరోజూ దాదాపు 50,000 మంది వ్యక్తుల రాకపోకలను నిర్వహించగలదు. జనవరి 15 నాటికి ఇది పూర్తిగా సిద్ధమవుతుంది. శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన ఒక రోజు తర్వాత జనవరి 23 నుండి ఆలయం ప్రజలకు తెరిచి ఉంటుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఆలయాన్ని జనవరి 22, 2024న ప్రారంభించనున్నారు. ఆలయ ప్రాంగణంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లకు రామమందిర్ ట్రస్ట్ బాధ్యత వహిస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే భక్తులకు 320 అడుగుల దూరం నుండి రాముడిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ప్రారంభోత్సవం రోజున రామభక్తులందరికీ ప్రసాదం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులను దర్శనం కోసం నాలుగు లైన్లలో ఏర్పాటు చేయగా, ఒక్కరోజులో లక్షన్నర నుంచి రెండున్నర లక్షల మంది శ్రీ రాముని దర్శనం చేసుకునే అవకాశం ఉంది.
Read Also:Harish Rao: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిందే టీఆర్ఎస్..
తాజావార్తలు
-
Dada: గంగూలీ బయోపిక్ నుంచి బర్త్డే ట్రీట్.. ‘దాదా’ ఫస్ట్ లుక్కు టైమ్ ఫిక్స్
-
Kommidi Narasimha Reddy: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు!
-
Ethnic Unity Law: ముస్లింలే టార్గెట్.. కమ్యూనిస్టు దేశంలో మైనార్టిలపై అణచివేత చట్టాలు!
-
YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్కు నివాళి
-
Aakasamlo Oka Tara: సెట్స్ నుంచి దుల్కర్ సల్మాన్ షేర్ చేసిన BTS ఫొటో వైరల్.. పెరిగిన అంచనాలు
ట్రెండింగ్
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!