Site icon NTV Telugu

Ram Gopal Varma: జీసస్, అల్లా మధ్య ఫైట్.. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా..

Rgv

Rgv

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. క్షిపణుల దాడులు, డ్రోన్ల విధ్వంసంతో అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. ఇలాంటి సీరియస్ ఇష్యూపై టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరతీసింది. యుద్ధాన్ని కేవలం దేశాల మధ్య పోరాటంగా కాకుండా, మతాల మధ్య యుద్ధంగా అభివర్ణిస్తూ ఆర్జీవీ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Also Read : Laya : అలాంటి రోల్స్ వస్తే.. నాలోని మరో కోణాన్ని చూపిస్తా..

అమెరికా ప్రధానంగా క్రైస్తవ దేశం కావడం, ఇరాన్ ఇస్లామిక్ దేశం కావడాన్ని ఉద్దేశిస్తూ ఆర్జీవీ ఒక వింతైన సవాల్ విసిరారు.. ‘అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పోరాటం జీసస్, అల్లా మధ్య ఫైట్ లాంటిది. ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే నేను ఆ మతంలోకి మారిపోతాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది కేవలం ఆర్జీవీ మార్క్ సెటైర్ అని అంటుంటే, మరికొందరు మతపరమైన భావాలను కించపరిచేలా ఉందని మండిపడుతున్నారు. అంతే కాదు

మరో ట్వీట్‌లో డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ‘సర్కార్’ సినిమాలోని డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. ‘బలవంతుడు ఏం చేసినా రైటే. ఎవరి దగ్గరైతే అధికారం, బలం ఉంటుందో వారు చేసే తప్పు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ట్రంప్ దగ్గర బలం ఉంది కాబట్టి ఆయనే రైట్’ అని పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైన తర్వాత ఇరాన్ రగిలిపోతుండటం, మిడిల్ ఈస్ట్‌లో విమాన సర్వీసులు రద్దయి భారతీయులు చిక్కుకుపోవడం వంటి పరిణామాల మధ్య ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ ఆయిల్ పోసినట్లుగా మారాయి.

 

Exit mobile version