Rajnath Singh: ‘సింధ్ రేపు మళ్లీ భారతదేశంలో భాగం కావచ్చు..’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వరల్డ్ సింధీ హిందూ ఫౌండేషన్ ఆఫ్ అసోసియేషన్స్ (VSHFA) నిర్వహించిన ‘స్ట్రాంగ్ సొసైటీ – స్ట్రాంగ్ ఇండియా’ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింధ్ భూభాగం భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ సాంస్కృతిక దృక్పథం నుంచి చూస్తే, సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగానే ఉంటుందని అన్నారు. భూమి విషయానికొస్తే, సరిహద్దులు మారవచ్చు.. ఎవరికి తెలుసు, సింధ్ రేపు మళ్లీ భారతదేశంలో భాగం కావచ్చు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
READ ALSO: Spirit : ప్రభాస్ ను దాచేస్తున్న వంగా.. కారణం అదే
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
అద్వానీ పుస్తకం గురించి ప్రస్తావించిన రాజ్నాథ్ సింగ్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947లో విభజన తర్వాత సింధు నదికి సమీపంలో ఉన్న సింధ్ ప్రావిన్స్ పాకిస్థాన్కు వెళ్లింది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న సింధ్ ప్రజలు భారతదేశానికి వలస వచ్చారు. సింధ్ ప్రజలు హిందువులు, ముఖ్యంగా ఎల్.కె. అద్వానీ వంటి నాయకుల తరం, సింధ్ ప్రాంతాన్ని భారతదేశం నుంచి వేరు చేయడాన్ని ఎప్పుడూ అంగీకరించలేదని అన్నారు. “నేను ఇక్కడ లాల్ కృష్ణ అద్వానీ గురించి కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. సింధీ ప్రజలు హిందువులు, ముఖ్యంగా అద్వానీ తరానికి చెందిన వారు, సింధ్ భారతదేశం నుంచి విడిపోవడాన్ని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారని ఆయన తన పుస్తకంలో రాశారు. సింధ్లోనే కాదు, భారతదేశం అంతటా, హిందువులు సింధు నదిని పవిత్రంగా భావించారు. సింధ్లోని చాలా మంది ముస్లింలు కూడా సింధు నది నీరు మక్కాలోని జమ్జామ్ నీటి కంటే తక్కువ పవిత్రమైనది కాదని విశ్వసించారు. ఇది అద్వానీ ప్రకటన” అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
‘రేపు సింధ్ మళ్లీ భారతదేశంలో భాగమవ్వచ్చు’..
ఈ రోజు సింధ్ భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ సాంస్కృతిక దృక్పథం నుంచి అది ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. భూ సరిహద్దులు మారవచ్చు.. ఎవరికి తెలుసు, సింధ్ రేపు భారతదేశానికి తిరిగి రావచ్చని ఆయన చెప్పారు. “సింధు నదిని పవిత్రంగా భావించే మన సింధ్ ప్రజలు ఎల్లప్పుడూ మనవారే. వారు ఎక్కడ ఉన్నా, వారు ఎల్లప్పుడూ మనవారే” అని ఆయన వెల్లడించారు. విభజన తర్వాత భారతదేశంలోని సింధీ సమాజం మొదటి నుంచి ప్రారంభమైందని, కానీ వారి కృషి, ధైర్యం ద్వారా వారు కొత్త విజయాలను సాధించారని పేర్కొన్నారు. నేడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సింధీ సమాజం వివిధ సామాజిక నిర్మాణ కార్యక్రమాలకు గణనీయమైన కృషి చేస్తోందని తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సింధీ సమాజం పోషించిన ముఖ్యమైన పాత్రకు చరిత్ర సాక్ష్యంగా ఉందని వెల్లడించారు.
సింధీ సమాజం హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నిలబడుతుందని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో సింధీ భాషను చేర్చడానికి మొదటి ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 1957లో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. భారతదేశ ఆత్మ సింధీలో మాట్లాడుతుందని చెబుతూ అటల్ జీ సింధీ భాషకు మద్దతు ఇచ్చారని తెలిపారు.
भारतीय जनता पार्टी हमेशा से सिंधी समाज के हक और उनकी अधिकार के पक्ष में खड़ी रही है। सिंधी भाषा को संविधान की आठवीं अनुसूची में शामिल कराने के लिए श्रद्धेय अटल बिहारी वाजपेयी जी ने 1957 में पहला गैर-सरकारी विधेयक पेश कर महत्वपूर्ण भूमिका निभाई थी। श्रद्धेय अटल जी ने सिंधी भाषा का… pic.twitter.com/av7gwaWlKw
— Rajnath Singh (@rajnathsingh) November 23, 2025
READ ALSO: G20 Summit Dispute: దౌత్యపరమైన వివాదంతో ముగిసిన జీ-20 సమావేశం
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!