Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rajnath Singh Says Sindh May Rejoin India Strong Society Event

Rajnath Singh: ‘సింధ్ రేపు మళ్లీ భారతదేశంలో భాగం కావచ్చు..’

Published Date :November 23, 2025 , 9:04 pm
By Shiva Ganesh
Rajnath Singh: ‘సింధ్ రేపు మళ్లీ భారతదేశంలో భాగం కావచ్చు..’
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajnath Singh: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వరల్డ్ సింధీ హిందూ ఫౌండేషన్ ఆఫ్ అసోసియేషన్స్ (VSHFA) నిర్వహించిన ‘స్ట్రాంగ్ సొసైటీ – స్ట్రాంగ్ ఇండియా’ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింధ్ భూభాగం భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ సాంస్కృతిక దృక్పథం నుంచి చూస్తే, సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగానే ఉంటుందని అన్నారు. భూమి విషయానికొస్తే, సరిహద్దులు మారవచ్చు.. ఎవరికి తెలుసు, సింధ్ రేపు మళ్లీ భారతదేశంలో భాగం కావచ్చు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

READ ALSO: Spirit : ప్రభాస్ ను దాచేస్తున్న వంగా.. కారణం అదే

అద్వానీ పుస్తకం గురించి ప్రస్తావించిన రాజ్‌నాథ్ సింగ్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947లో విభజన తర్వాత సింధు నదికి సమీపంలో ఉన్న సింధ్ ప్రావిన్స్ పాకిస్థాన్‌కు వెళ్లింది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న సింధ్ ప్రజలు భారతదేశానికి వలస వచ్చారు. సింధ్ ప్రజలు హిందువులు, ముఖ్యంగా ఎల్.కె. అద్వానీ వంటి నాయకుల తరం, సింధ్ ప్రాంతాన్ని భారతదేశం నుంచి వేరు చేయడాన్ని ఎప్పుడూ అంగీకరించలేదని అన్నారు. “నేను ఇక్కడ లాల్ కృష్ణ అద్వానీ గురించి కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. సింధీ ప్రజలు హిందువులు, ముఖ్యంగా అద్వానీ తరానికి చెందిన వారు, సింధ్ భారతదేశం నుంచి విడిపోవడాన్ని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారని ఆయన తన పుస్తకంలో రాశారు. సింధ్‌లోనే కాదు, భారతదేశం అంతటా, హిందువులు సింధు నదిని పవిత్రంగా భావించారు. సింధ్‌లోని చాలా మంది ముస్లింలు కూడా సింధు నది నీరు మక్కాలోని జమ్‌జామ్ నీటి కంటే తక్కువ పవిత్రమైనది కాదని విశ్వసించారు. ఇది అద్వానీ ప్రకటన” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

‘రేపు సింధ్ మళ్లీ భారతదేశంలో భాగమవ్వచ్చు’..
ఈ రోజు సింధ్ భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ సాంస్కృతిక దృక్పథం నుంచి అది ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. భూ సరిహద్దులు మారవచ్చు.. ఎవరికి తెలుసు, సింధ్ రేపు భారతదేశానికి తిరిగి రావచ్చని ఆయన చెప్పారు. “సింధు నదిని పవిత్రంగా భావించే మన సింధ్ ప్రజలు ఎల్లప్పుడూ మనవారే. వారు ఎక్కడ ఉన్నా, వారు ఎల్లప్పుడూ మనవారే” అని ఆయన వెల్లడించారు. విభజన తర్వాత భారతదేశంలోని సింధీ సమాజం మొదటి నుంచి ప్రారంభమైందని, కానీ వారి కృషి, ధైర్యం ద్వారా వారు కొత్త విజయాలను సాధించారని పేర్కొన్నారు. నేడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సింధీ సమాజం వివిధ సామాజిక నిర్మాణ కార్యక్రమాలకు గణనీయమైన కృషి చేస్తోందని తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సింధీ సమాజం పోషించిన ముఖ్యమైన పాత్రకు చరిత్ర సాక్ష్యంగా ఉందని వెల్లడించారు.

సింధీ సమాజం హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నిలబడుతుందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో సింధీ భాషను చేర్చడానికి మొదటి ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 1957లో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. భారతదేశ ఆత్మ సింధీలో మాట్లాడుతుందని చెబుతూ అటల్ జీ సింధీ భాషకు మద్దతు ఇచ్చారని తెలిపారు.

भारतीय जनता पार्टी हमेशा से सिंधी समाज के हक और उनकी अधिकार के पक्ष में खड़ी रही है। सिंधी भाषा को संविधान की आठवीं अनुसूची में शामिल कराने के लिए श्रद्धेय अटल बिहारी वाजपेयी जी ने 1957 में पहला गैर-सरकारी विधेयक पेश कर महत्वपूर्ण भूमिका निभाई थी। श्रद्धेय अटल जी ने सिंधी भाषा का… pic.twitter.com/av7gwaWlKw

— Rajnath Singh (@rajnathsingh) November 23, 2025

READ ALSO: G20 Summit Dispute: దౌత్యపరమైన వివాదంతో ముగిసిన జీ-20 సమావేశం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India Pakistan Sindh issue
  • L.K. Advani Sindh book
  • Rajnath Singh Sindh remarks
  • Rajnath Singh Speech
  • Sindh India cultural ties

తాజావార్తలు

  • CM Chandrababu: సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ.. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం.!

  • RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్‌ అనుమానమే!

  • Pradeep Ranganathan : చాలా బ్రేకప్స్ చూశా..వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు!

  • BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!

  • Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions