Rajnath Singh: ‘సింధ్ రేపు మళ్లీ భారతదేశంలో భాగం కావచ్చు..’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వరల్డ్ సింధీ హిందూ ఫౌండేషన్ ఆఫ్ అసోసియేషన్స్ (VSHFA) నిర్వహించిన ‘స్ట్రాంగ్ సొసైటీ – స్ట్రాంగ్ ఇండియా’ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింధ్ భూభాగం భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ సాంస్కృతిక దృక్పథం నుంచి చూస్తే, సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగానే ఉంటుందని అన్నారు. భూమి విషయానికొస్తే, సరిహద్దులు మారవచ్చు.. ఎవరికి తెలుసు, సింధ్ రేపు మళ్లీ భారతదేశంలో భాగం కావచ్చు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
READ ALSO: Spirit : ప్రభాస్ ను దాచేస్తున్న వంగా.. కారణం అదే
Also Read
- 40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
- నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
అద్వానీ పుస్తకం గురించి ప్రస్తావించిన రాజ్నాథ్ సింగ్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947లో విభజన తర్వాత సింధు నదికి సమీపంలో ఉన్న సింధ్ ప్రావిన్స్ పాకిస్థాన్కు వెళ్లింది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న సింధ్ ప్రజలు భారతదేశానికి వలస వచ్చారు. సింధ్ ప్రజలు హిందువులు, ముఖ్యంగా ఎల్.కె. అద్వానీ వంటి నాయకుల తరం, సింధ్ ప్రాంతాన్ని భారతదేశం నుంచి వేరు చేయడాన్ని ఎప్పుడూ అంగీకరించలేదని అన్నారు. “నేను ఇక్కడ లాల్ కృష్ణ అద్వానీ గురించి కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. సింధీ ప్రజలు హిందువులు, ముఖ్యంగా అద్వానీ తరానికి చెందిన వారు, సింధ్ భారతదేశం నుంచి విడిపోవడాన్ని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారని ఆయన తన పుస్తకంలో రాశారు. సింధ్లోనే కాదు, భారతదేశం అంతటా, హిందువులు సింధు నదిని పవిత్రంగా భావించారు. సింధ్లోని చాలా మంది ముస్లింలు కూడా సింధు నది నీరు మక్కాలోని జమ్జామ్ నీటి కంటే తక్కువ పవిత్రమైనది కాదని విశ్వసించారు. ఇది అద్వానీ ప్రకటన” అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
‘రేపు సింధ్ మళ్లీ భారతదేశంలో భాగమవ్వచ్చు’..
ఈ రోజు సింధ్ భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ సాంస్కృతిక దృక్పథం నుంచి అది ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. భూ సరిహద్దులు మారవచ్చు.. ఎవరికి తెలుసు, సింధ్ రేపు భారతదేశానికి తిరిగి రావచ్చని ఆయన చెప్పారు. “సింధు నదిని పవిత్రంగా భావించే మన సింధ్ ప్రజలు ఎల్లప్పుడూ మనవారే. వారు ఎక్కడ ఉన్నా, వారు ఎల్లప్పుడూ మనవారే” అని ఆయన వెల్లడించారు. విభజన తర్వాత భారతదేశంలోని సింధీ సమాజం మొదటి నుంచి ప్రారంభమైందని, కానీ వారి కృషి, ధైర్యం ద్వారా వారు కొత్త విజయాలను సాధించారని పేర్కొన్నారు. నేడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సింధీ సమాజం వివిధ సామాజిక నిర్మాణ కార్యక్రమాలకు గణనీయమైన కృషి చేస్తోందని తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సింధీ సమాజం పోషించిన ముఖ్యమైన పాత్రకు చరిత్ర సాక్ష్యంగా ఉందని వెల్లడించారు.
సింధీ సమాజం హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నిలబడుతుందని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో సింధీ భాషను చేర్చడానికి మొదటి ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 1957లో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. భారతదేశ ఆత్మ సింధీలో మాట్లాడుతుందని చెబుతూ అటల్ జీ సింధీ భాషకు మద్దతు ఇచ్చారని తెలిపారు.
भारतीय जनता पार्टी हमेशा से सिंधी समाज के हक और उनकी अधिकार के पक्ष में खड़ी रही है। सिंधी भाषा को संविधान की आठवीं अनुसूची में शामिल कराने के लिए श्रद्धेय अटल बिहारी वाजपेयी जी ने 1957 में पहला गैर-सरकारी विधेयक पेश कर महत्वपूर्ण भूमिका निभाई थी। श्रद्धेय अटल जी ने सिंधी भाषा का… pic.twitter.com/av7gwaWlKw
— Rajnath Singh (@rajnathsingh) November 23, 2025
READ ALSO: G20 Summit Dispute: దౌత్యపరమైన వివాదంతో ముగిసిన జీ-20 సమావేశం
తాజావార్తలు
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
-
PM SVANidhi Scheme: కేంద్రం గుడ్న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
-
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్కు ముందే లాభాలు
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!