సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ చిత్రాల్లో సీనియర్ బ్యూటీలను రిపీట్ చేస్తున్నారు. నరసింహాలో నీలాంబరిగా తనతో పోటీపడి నటించిన రమ్యకృష్ణతో మళ్లీ కలిసి నటించలేదు. మళ్లీ ఈ జోడీ సాధ్యమా అనుకున్న టైంలో సుసాధ్యమే అని ఫ్రూవ్ చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్లో భార్యా భర్తలుగా నటించారు ఈ పెయిర్. నెక్ట్స్ జైలర్2లోనూ ఈ పెయిర్ కంటిన్యూ కాబోతుంది.
Also Read : Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా షోలు రద్దు!
జైలర్2 తర్వాత తలైవా 173 షూట్తో బిజీగా మారబోతున్నారు రజనీ. లోకేశ్ కనగరాజ్ ఆఫర్ సిబి చక్రవర్తి వద్దకు చేరింది. ఈ మూవీలో సూపర్ స్టార్కు జోడీగా సీనియర్ నటి శోభనను పరిశీలిస్తున్నాడట. గతంలో ఈ ఇద్దరు శివ, దళపతి చిత్రాల్లో నటించారు. కొచ్చాడియన్లో కనిపించినా అది రెగ్యులర్ మూవీ కాదు. దళపతిలో ప్రేమించుకుని.. కొన్ని అనివార్య కారణాలతో విడిపోతుంది ఈ జోడీ. మళ్లీ అప్పటి నుండి తెరపై కనిపించలేదు ఈ పెయిర్. వన్స్ ఆపాన్ ఎ టైం స్టార్ హీరోలతో జోడీ కట్టిన శోభన.. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్కు షిప్టైంది. అప్పుడప్పుడు సీనియర్ హీరోలతో నటిస్తూ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తోంది ఈ నాట్య మయూరి. 55లోకి అడుగుపెట్టిన శోభన.. గత ఏడాది మలయాళ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తుడరుమ్లో మోహన్ లాల్తో స్క్రీన్ షేర్ చేసుకుంది. నెక్ట్స్ రజనీకాంత్ సరసన ఫిక్సైతే.. 35 ఏళ్ల తర్వాత తెరపై ఆడియన్స్ ఎంతో ఇష్టపడే క్రేజీ కాంబో సెటైనట్లే.
