Free Sanitary Napkins: మహిళలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు.. దేశంలోనే మొదటి రాష్ట్రంగా..

Sanitary Napkins

Sanitary Napkins

Free Sanitary Napkins: రాజస్థాన్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు, బాలికల ఆరోగ్యం కోసం ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందించనున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్ ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో మహిళలు, బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను అందించడానికి రూ.200 కోట్లు కేటాయించిందని రాష్ట్ర మంత్రి మమతా భూపేష్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ‘ఐ యామ్‌ శక్తి ఉడాన్‌’ పథకాన్ని అమలు చేస్తున్నామని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మమతా భూపేష్‌ తెలిపారు.

దేశంలోనే ఇటువంటి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం రాజస్థాన్ అని ఆమె అసెంబ్లీలో చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, బాలికలకు ఉచితంగా అందజేస్తున్న శానిటరీ న్యాప్‌కిన్‌ల పరిమాణంలో ఎలాంటి మార్పు లేదని ఆమె తెలిపారు. ఈ పథకం కోసం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 200 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగిందని మమతా భూపేష్ తెలిపారు. 33 జిల్లాల్లోని 60,361 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1.15 కోట్ల మంది లబ్ధిదారులకు, రాష్ట్రంలోని 34,104 ప్రభుత్వ పాఠశాలల్లో 26.48 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందించేందుకు సరఫరా ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

Kerala: పీఎఫ్ఐ నిరసనలు హింసాత్మకం.. 500 మంది అరెస్ట్

గత ఏడాది కాలంలో, రాజస్థాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (RMSCL) 31 జిల్లాల్లోని 26,220 పాఠశాలలకు, 23 జిల్లాల్లోని 31,255 అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా శానిటరీ నాప్‌కిన్‌లను అందించింది. ఈ ప్రయోజనం కోసం మొత్తం రూ.104.78 కోట్లను ఆర్‌ఎంఎస్‌సీఎల్ ఖర్చు చేసిందని ఆమె తెలిపారు.