Rajasthan Election 2023: స్కూటీపై వచ్చి ఓటేసిన ఎంపీ.. వీడియో వైరల్!
MP Subhash Chandra Baheria Came on a Scooty and cast his vote: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు (నవంబర్ 25) పోలింగ్ జరుగుతోంది. 33 జిల్లాల్లోని 199 స్థానాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు కూడా పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని ఓట్లు వేస్తున్నారు.
ఇప్పటి వరకు సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ సీఎం వసుంధర రాజే సహా పలువురు నేతలు ఓటు వేశారు. అయితే బీజేపీ ఎంపీ సుభాష్ చంద్ర బహేరియా తనదైన శైలిలో ఓటేశారు. సుభాష్ చంద్ర తన భార్య రంజనా బహేరియాతో కలిసి టూవీలర్పై బిల్వారాలోని పోలింగ్ బూత్కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. స్కూటీపై సాదాసీదాగా పోలింగ్ బూత్కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
Also Read: IPL Auction 2024: ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ ట్రేడింగ్ విధానం ద్వారా కెప్టెన్ మారాడు!
బీజేపీ ఎంపీ సుభాష్ చంద్ర బహేరియా స్కూటీపై వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు స్కూటీపై ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించారు. అతని సింప్లిసిటీని అందరూ మెచ్చుకోవడానికి ఇదే కారణం కావచ్చు. ప్రస్తుతం భిల్వారా లోక్సభ నియోజకవర్గం నుంచి సుభాష్ చంద్ర ఎంపీగా ఉన్నారు. బీజేపీ టికెట్పై పోటీ చేసి మూడుసార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. 1996-97 లోక్సభ ఎన్నికల్లో భిల్వారా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి.. ఎంపీ అయ్యారు. 2003లో భిల్వారా నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..
-
IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్పై సంచలన ఆరోపణలు.. స్లాప్గేట్ మళ్లీ వార్తల్లో
-
AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?
-
Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!
-
Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!