Rajasthan CM: బీహార్ తరహాలో కులాల సర్వే.. రాజస్థాన్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Chief Minister Announces Caste Survey Ahead Of State Elections: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్లో జరిగిన తరహాలో రాష్ట్రంలో కూడా కులాల సర్వే నిర్వహిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. జైపూర్లోని పార్టీ వార్రూమ్లో శుక్రవారం జరిగిన రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఆర్పీసీసీ) కోర్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. అశోక్ గెహ్లాట్తో పాటు రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుఖ్జిందర్ రాంధావా, ఆర్పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, ఇతర నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Also Read: PM Modi Speech: ఎర్రకోట ప్రసంగంలో చేసిన ప్రకటనలపై ప్రధాని మోడీ సమీక్ష
Also Read
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- CJP Protest: "4 గంటల సమయం దండగ".. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
రాజస్థాన్ ప్రభుత్వం కూడా బీహార్లో జరిగిన తరహాలో కులాల సర్వే నిర్వహిస్తుందని గెహ్లాట్ సమావేశం అనంతరం శుక్రవారం విలేకరులతో అన్నారు. కులాల సర్వే, జనాభా దామాషా ప్రకారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కాన్సెప్ట్ను రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకువెళతామన్నారు. పార్టీ ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని, రాజస్థాన్ ప్రభుత్వం ఈ ప్రచారాన్ని ప్రకటించాలని తాము నిర్ణయించుకున్నామని సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. ‘‘దేశంలో రకరకాల కులాలున్నాయి.. రకరకాల మతాల వారు ఇక్కడ నివసిస్తున్నారు, వివిధ కులాలవారు రకరకాలుగా ఉద్యోగాలు చేస్తుంటారు. ఏ కులాల జనాభా ఎంత ఉందో తెలుసుకుంటే వారి కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలో తెలుసుకోవచ్చు. కులాల వారీగా పథకాలను సిద్ధం చేయడం మాకు సులభం అవుతుంది.” అని ఆయన అన్నారు.
Also Read: Israel-Palestine Conflict: ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదం ఏంటీ.. ఎందుకీ హింస..?
ఈ సమావేశంలో కుల ఆధారిత సర్వేతో పాటు తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ (ఈఆర్సీపీ) అంశంపై యాత్రపై చర్చలు కూడా జరిగాయని రాంధావా చెప్పారు. అంతకుముందు, 13 జిల్లాల సాగునీరు మరియు తాగునీటి అవసరాలను తీర్చగల తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ కోసం జాతీయ ప్రాజెక్ట్ హోదాను డిమాండ్ చేయడానికి కాంగ్రెస్ తూర్పు రాజస్థాన్లో ఐదు రోజుల యాత్రను చేపట్టాలని ప్రణాళిక వేసింది. అయితే పార్టీ వాయిదా వేసింది.
రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దోతస్రా శుక్రవారం మాట్లాడుతూ.. సోమవారం కీలక సమావేశం జరుగుతుందని, ఇందులో తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ సమస్యపై యాత్ర తేదీలు నిర్ణయించబడతాయన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ‘కామ్ కియా దిల్ సే, కాంగ్రెస్ ఫిర్ సే’ అనే నినాదం ఉంటుందని ఆయన తెలిపారు.2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లో లేదా అంతకు ముందు జరుగుతాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
-
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!