Delhi: బుల్లెట్ ట్రైన్పై రైల్వే మంత్రి కొత్త కబురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ బుల్లెట్ ట్రైన్పై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త కబురు చెప్పారు. మరో రెండేళ్లలో ఇండియాలో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టబోతుందని వెల్లడించారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అహ్మదాబాద్-ముంబై మార్గంలో బుల్లెట్ రైళ్ల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. మొదటి విభాగాన్ని 2026లో ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Jogi Ramesh: రాష్ట్ర ప్రజలందరూ జగనన్న వైపే ఉన్నారు.. సర్వేలు కూడా అనుకూలంగా ఉన్నాయి
Also Read
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
భారత్లో ప్రారంభం కాబోయే బుల్లెట్ రైలు కోసం వివిధ స్టేషన్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. తొలి దిశను రెండేళ్ల ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అహ్మదాబాద్-ముంబై మార్గంలో పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికే 290 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తయ్యాయన్నారు. ఎనిమిది నదులపై వంతెనలు నిర్మించినట్లు చెప్పారు. 12 స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయని… స్టేషన్లు కూడా బుల్లెట్ ట్రైన్కు తగినట్టుగానే నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు దాదాపు చివరి దిశకు వస్తున్నాయని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రధాని మోడీ ‘చొరబాటుదారుల’ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ఫిర్యాదుతో ఈసీ పరిశీలన..
బుల్లెట్ రైలు చాలా క్లిష్టమైన ప్రాజెక్ట్ అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పనులు 2017లో ప్రారంభమయ్యాయన్నారు. డిజైన్ను పూర్తి చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టిందని తెలిపారు. ట్రైన్ వేగం చాలా బలంగా ఉంటుంది కాబట్టి అందుకు తగినట్టుగా డిజైన్ రూపకల్పన చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ప్రతిదీ చాలా జాగ్రత్తగా పరిశీలించి.. పనులు పనులకు శ్రీకారం చుట్టినట్లుగా వివరించారు. కోవిడ్ కారణంగా కొంత ఎదురుదెబ్బ తగలిందని.. అందుకే పనుల విషయంలో కొంత జాప్యం జరిగినట్లుగా తెలిపారు. ఇక మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి నిరాకరించిందని.. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయిందని ఆరోపించారు. కానీ ఇప్పుడు మాత్రం పనులు చాలా బాగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
బుల్లెట్ రైలు కారిడార్లో 21 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉందన్నారు. ఇందులో 7 కిలోమీటర్ల సముద్రగర్భం ఉంటుందని.. సొరంగం యొక్క లోతైన స్థానం 56 మీటర్లు అని తెలిపారు. సొరంగం లోపల బుల్లెట్ రైళ్లు గంటకు 300-320 కి.మీ వేగంతో నడుస్తాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Nani : నరేష్ ను నేనే వాటికి కాస్త బ్రేక్ ఇవ్వమని చెప్పా..
తాజావార్తలు
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!