Indian Railways : ఈ వార్త వింటే మీరు రైలు లేటైతే బాగుండు అంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways : రైలు ప్రయాణం సరదాగా ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరూ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకే భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వే అవతరించింది. భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త శుభవార్త తీసుకొచ్చింది. ఇక నుంచి రైలు ప్రయాణంలో ఉచితంగా ఆహారం పొందవచ్చు. కొత్త నిబంధన ప్రకారం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు ఆహారం కోసం ప్రత్యేకంగా రుసుం చెల్లించాల్సిన పనిలేదు. కానీ ఇందుకు ఓ షరతు ఉంది.
మీరు ఎక్కే రైలు ఆలస్యంగా నడుస్తున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. రైలు ఆలస్యం అయితే.. మీకు IRCTC ఉచితంగా ఆహారం అందజేస్తుంది. మీరు ఈ సౌకర్యాన్ని ఆనందంగా, సులభంగా ఆస్వాదించవచ్చు. ఇందుకు రుసుం చెల్లించొద్దు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలు ఆలస్యమైతే IRCTC క్యాటరింగ్ విధానంలో ప్రయాణీకులకు అల్పాహారం, తేలికపాటి భోజనం అందించబడుతుంది.
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్కే ఛాన్స్!
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- India vs Afghanistan: భారత్తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
Read Also: Cheque Bounce Rules: చెక్ బౌన్స్ అయితే మీరు బుక్ అయినట్లే.. భారీ జరిమానా, జైలు శిక్ష
ఈ సదుపాయం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే..
IRCTC నిబంధనల ప్రకారం.. మీ రైలు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయినప్పుడు ఈ సౌకర్యం మీకు అందించబడుతుంది. ఎక్స్ప్రెస్ రైలులోని ప్రయాణికులు మాత్రమే ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోగలరు. శతాబ్ది, రాజధాని, దురంతో వంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఈ వార్త చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Read Also:India Oil Exports: రష్యా ఆయిల్తో భారత్ వ్యాపారం.. యూరప్కు పెరిగిన ఎగుమతులు..
అల్పాహారం ఏంటి ?
రైలులో అల్పాహారంలో టీ-కాఫీ, బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం అల్పాహారం, టీ లేదా కాఫీ, నాలుగు బ్రెడ్ స్లైసులు (గోధుమ/తెలుపు), ఒక బటర్ చిప్లెట్ ఇస్తారు. దీంతో పాటు ప్రయాణికులకు మధ్యాహ్నం రోటీ, పప్పు, కూరగాయలు తదితరాలు ఉచితంగా లభిస్తాయి. మీ రైలు ఆలస్యంగా నడుస్తుంటే నిబంధనల ప్రకారం ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
-
Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్కే ఛాన్స్!
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!