Kishan Reddy: కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోంది అన్నారు. అలాగే, కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి చేయబడింది.. దేశంలోని వెనుకబడిన ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించారు. ఇక, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో రూ.3,900 కోట్ల వ్యయంతో నిర్మించిన జాతీయ రహదారులను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించి జాతికి అంకితం చేశారని తెలిపారు. మోడీజీ ప్రభుత్వంలో నితిన్ గడ్కరీ నేతృత్వంలోని తెలంగాణలో 5 వేలకు పైగా కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు నిర్మించబడ్డాయని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
Read Also: IPL : Dream11లో 4 కోట్లుగెలిచిన యువకుడు..!
అయితే, ఎక్స్ప్రెస్వేలు, అండర్పాస్ ల నిర్మాణంతో రోడ్డు రవాణా వ్యవస్థను సరళీకృతం అవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రహదారుల అభివృద్ధితో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి, వాహనాల నడక సామర్థ్యం మెరుగుపడింది, చమురు వినియోగం తగ్గిందన్నారు. రోడ్, రైల్వే, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందన్నారు. అలాగే, ఆదిలాబాద్, జహీరాబాద్లలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేశారు.. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 7 మెగా టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి తెలంగాణకు కేటాయించబడింది.. ఖాజీపేటలో రూ.800 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ మంజూరు చేశారు.. రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.12,000 కోట్లతో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేశారు.. రూ.442 కోట్లతో రామగుండంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: NANI : హిట్ 3.. డిస్ట్రిబ్యూటర్స్ కి డేంజర్ బెల్స్..
ఇక, ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్లో కేంద్రీయ పసుపు బోర్డును ప్రారంభించాం.. ప్రధాని మోడీ చొరవతో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చింది.. రూ.31,220 కోట్లతో రైల్వే లైన్లు, డబ్లింగ్ ప్రాజెక్టుల అమలు కొనసాగుతోంది.. రూ.1,25,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, రూ.86,492 కోట్లతో కొత్త రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు జరుగుతున్నాయి.. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.. ఆదిలాబాద్లో డిఫెన్స్ ఎయిర్పోర్టు ప్రారంభానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దేశవ్యాప్తంగా 83 కోట్ల మందికి నెలకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందజేస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానిది.. పేదల కోసం సంవత్సరానికి రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్య సేవల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నారు.. దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ప్లానింగ్ కమిషన్ ద్వారా నిధులు విధుల చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరపున కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.