Rahul Gandhi : దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరగబోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొల్లాపూర్లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల తెలంగాణ… దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ ఉండే.. దాన్ని వద్దనుకుని కొల్లాపూర్ కి వచ్చానని, కేసీఆర్ కుటుంబం ఒక వైపు.. తెలంగాణ సమాజం.. యువత.. మహిళ లు మరోవైపు ఉన్నారన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో సమాజం చూస్తూనే ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దగా చేసిందన్నారు రాహుల్ గాంధీ. కాళేశ్వరం కట్టించి ఏడాది కూడా కాలేదని, అప్పుడే కూలిపోయే పరిస్థితి వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవచ్చునన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులు కట్టింది.. నాగార్జున సాగర్, సింగూర్, జూరాల కట్టింది కాంగ్రెస్సే.. మేము కట్టిన అన్ని ప్రాజెక్టులు చూడండి.. మరో వైపు కాళేశ్వరం చూడండి.. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటై పని చేస్తున్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు.
అంతేకాకుండా.. ‘ఇక్కడికి మా సోదరి రావాల్సి ఉండే. మా చెల్లి రాలేని పక్షంలో నేను వచ్చా. మీకు..మాకు ఉన్న బంధం కుటుంబ బంధం అందుకే నేను వచ్చా. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దగా చేసింది. బీజేపీ.. బీఆర్ఎస్ కలిసి ప్రజల సొమ్ము లూటీ చేస్తు్న్నాయి. లక్ష కోట్లు .. కేసీఆర్ సొమ్ము దోచుకున్నాడు. రైతులు..పేదలు.. సామాన్యుల నుండి మింగేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో పేదలకు భూములు ఇచ్చింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి లాక్కుంటుంది. ధరణి పేరుతో భూములు లాక్కుని కుట్ర జరుగుతోంది. తెలంగాణ లో 20 లక్షల మందికి ధరణి తో నష్టం. ధరణి తో కేవలం కేసీఆర్ కుటుంబం కె లాభం జరిగింది. రెవెన్యూ.. లిక్కర్.. ఇసుక అమ్ముకునే శాఖ అన్నీ కేసీఆర్ కుటుంభం దగ్గరే ఉన్నాయి. తెలంగాణ పోరాటం దొరల తెలంగాణ కోసం కల కనలేదు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ప్రజల తెలంగాణ కోరుకుంది, తెలంగాణ లో బీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్యనే పోటీ. బీజేపీ..బీఆర్ఎస్.. ఎంఐఎం ఒక్కటై పని చేస్తున్నాయి. లోక్ సభలో కేసీఆర్.. బీజేపీ కి మద్దతు ఇస్తోంది. జీఎస్టీ.. రైతు చట్టాలకు కూడా మద్దతు పలికింది. బీజేపీ.. ఎంఐఎంకి ఓటేస్తే బీఆర్ఎస్కి వేసినట్టే. ఇక్కడ బీఆర్ఎస్తో.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీతో కొట్లాడుతున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ని ఓడగొడతాం. 2024 లో ఢిల్లీలో కూడా బీజేపీ ని నిలువరిస్తాం. తెలంగాణ లో అధికారం.. డబ్బులు..మీడియా కేసీఆర్ వెంట ఉన్నాయి, ప్రజలు కాంగ్రెస్ తో ఉన్నారు. ప్రజలు.. కాంగ్రేస్ కార్యకర్తలు కలిసి..ప్రజల తెలంగాణ కోసం పని చేయండి. ఇవాళ ఇందిరా గాంధీ వర్థంతి. మనది రాజకీయ బంధం కాదు..కుటుంబ బంధం. మా నానమ్మ కి తెలంగాణ అండగా నిలబడింది. జీవితంలో చారిత్రాత్మక సత్యం మరిచిపోలేను. మీరు పోరాడితే.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును.. మేము అధికారం లోకి రాగానే ప్రజల జేబులోకి వచ్చేలా చేస్తాం.’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..