Rahul Gandhi : దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరగబోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొల్లాపూర్లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల తెలంగాణ… దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ ఉండే.. దాన్ని వద్దనుకుని కొల్లాపూర్ కి వచ్చానని, కేసీఆర్ కుటుంబం ఒక వైపు.. తెలంగాణ సమాజం.. యువత.. మహిళ లు మరోవైపు ఉన్నారన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో సమాజం చూస్తూనే ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దగా చేసిందన్నారు రాహుల్ గాంధీ. కాళేశ్వరం కట్టించి ఏడాది కూడా కాలేదని, అప్పుడే కూలిపోయే పరిస్థితి వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవచ్చునన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులు కట్టింది.. నాగార్జున సాగర్, సింగూర్, జూరాల కట్టింది కాంగ్రెస్సే.. మేము కట్టిన అన్ని ప్రాజెక్టులు చూడండి.. మరో వైపు కాళేశ్వరం చూడండి.. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటై పని చేస్తున్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు.
అంతేకాకుండా.. ‘ఇక్కడికి మా సోదరి రావాల్సి ఉండే. మా చెల్లి రాలేని పక్షంలో నేను వచ్చా. మీకు..మాకు ఉన్న బంధం కుటుంబ బంధం అందుకే నేను వచ్చా. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దగా చేసింది. బీజేపీ.. బీఆర్ఎస్ కలిసి ప్రజల సొమ్ము లూటీ చేస్తు్న్నాయి. లక్ష కోట్లు .. కేసీఆర్ సొమ్ము దోచుకున్నాడు. రైతులు..పేదలు.. సామాన్యుల నుండి మింగేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో పేదలకు భూములు ఇచ్చింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి లాక్కుంటుంది. ధరణి పేరుతో భూములు లాక్కుని కుట్ర జరుగుతోంది. తెలంగాణ లో 20 లక్షల మందికి ధరణి తో నష్టం. ధరణి తో కేవలం కేసీఆర్ కుటుంబం కె లాభం జరిగింది. రెవెన్యూ.. లిక్కర్.. ఇసుక అమ్ముకునే శాఖ అన్నీ కేసీఆర్ కుటుంభం దగ్గరే ఉన్నాయి. తెలంగాణ పోరాటం దొరల తెలంగాణ కోసం కల కనలేదు.
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
ప్రజల తెలంగాణ కోరుకుంది, తెలంగాణ లో బీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్యనే పోటీ. బీజేపీ..బీఆర్ఎస్.. ఎంఐఎం ఒక్కటై పని చేస్తున్నాయి. లోక్ సభలో కేసీఆర్.. బీజేపీ కి మద్దతు ఇస్తోంది. జీఎస్టీ.. రైతు చట్టాలకు కూడా మద్దతు పలికింది. బీజేపీ.. ఎంఐఎంకి ఓటేస్తే బీఆర్ఎస్కి వేసినట్టే. ఇక్కడ బీఆర్ఎస్తో.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీతో కొట్లాడుతున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ని ఓడగొడతాం. 2024 లో ఢిల్లీలో కూడా బీజేపీ ని నిలువరిస్తాం. తెలంగాణ లో అధికారం.. డబ్బులు..మీడియా కేసీఆర్ వెంట ఉన్నాయి, ప్రజలు కాంగ్రెస్ తో ఉన్నారు. ప్రజలు.. కాంగ్రేస్ కార్యకర్తలు కలిసి..ప్రజల తెలంగాణ కోసం పని చేయండి. ఇవాళ ఇందిరా గాంధీ వర్థంతి. మనది రాజకీయ బంధం కాదు..కుటుంబ బంధం. మా నానమ్మ కి తెలంగాణ అండగా నిలబడింది. జీవితంలో చారిత్రాత్మక సత్యం మరిచిపోలేను. మీరు పోరాడితే.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును.. మేము అధికారం లోకి రాగానే ప్రజల జేబులోకి వచ్చేలా చేస్తాం.’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!