Rahul Gandhi : హత్రాస్ ప్రమాదానికి ఎవరు బాధ్యులు.. రాహుల్ భోలే బాబా గురించి ఏం చెప్పారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం అలీఘర్, హత్రాస్లో పర్యటించారు. ఇక్కడికి చేరుకున్న ఆయన హత్రాస్ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. హత్రాస్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హత్రాస్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. హత్రాస్ ప్రమాదం చాలా బాధాకరమని రాహుల్ అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందజేయాలన్నారు. ఈ ప్రమాదం వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయని రాహుల్ అన్నారు. చాలా మంది చనిపోయారు. దీనిపై ఎలాంటి రాజకీయాలు చేయకూడదనుకుంటున్నాను కానీ పరిపాలన లోపించి తప్పులు దొర్లాయని నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
Read Also:Milk Price In Pakistan: పాక్లో దడ పుట్టిస్తున్న పాల ధర.. ప్రజలు ఏం చేశారంటే..?
Also Read
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
- Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
#WATCH | Hathras, Uttar Pradesh: After meeting the bereaved families of the Hathras Stampede accident, Congress leader and Lok Sabha MP Rahul Gandhi says, "A lot of families have been affected and many people have died… I dont want to politicise this. There have been… pic.twitter.com/dohI2TpGVY
— ANI (@ANI) July 5, 2024
సాధ్యమైనంత త్వరగా నష్టపరిహారం బాధిత కుటుంబాలకు అందజేయాలని యూపీ సీఎంను అభ్యర్థిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా రాహుల్ మాట్లాడారు. బాధితులు ఎవరు, ఏంటి, వారు ఏం చేసేవారు, ఎలా జీవించారు ఇలా ప్రతీది చర్చించారు. పరిపాలన లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉండాల్సిన పోలీసు వ్యవస్థ అక్కడ లేదన్నారు. ఆ ప్రజలు తీవ్ర బాధలో ఉన్నారు. ఈ పరిస్థితిలో వారి బాధలను అర్థం చేసుకోవడానికి తాను ప్రయత్నించానన్నారు. అలీఘర్లోని పిల్ఖానా గ్రామంలో హత్రాస్ ప్రమాద బాధితుడు ఛోటే లాల్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ కలిశారు. తొక్కిసలాటలో చోటాలాల్ భార్య, కొడుకు చనిపోయారు. హత్రాస్లోని గ్రీన్ పార్క్లోని విభవ్ నగర్లో బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ కలిశారు. ఆశాదేవి, మున్నీదేవి, ఓంవతి కుటుంబాలను రాహుల్ కలిశారు. వారిని ఓదార్చారు. తొక్కిసలాటలో మూడు కుటుంబాలకు చెందిన నలుగురు చనిపోయారు.
Read Also:Keir Starmer: యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ విక్టరీ.. తదుపరి ప్రధానిగా కీర్ స్టామర్
Uttar Pradesh: Congress MP and Lok Sabha LoP Rahul Gandhi met the victims of the Hathras stampede, in Aligarh. pic.twitter.com/8h2vh8aijO
— ANI (@ANI) July 5, 2024
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!